యూఏఈ లో భారత ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన షెడ్యూల్
- February 11, 2024
యూఏఈ: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నుంచి రెండు రోజులపాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమై అబుదాబిలో మధ్యప్రాచ్యంలోని తొలి సంప్రదాయ హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభిస్తారు. గత ఎనిమిది నెలల్లో ఆయన యూఏఈకి రావడం ఇది మూడోసారి. 2015 తర్వాత ఏడవది. ఈ పర్యటనలో మోదీ అబుదాబి మరియు దుబాయ్లలో సమావేశాలలో పాల్గొంటారు. యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఒక ప్రకటనలో తెలిపింది.అలాగే వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తోనూ మోదీ భేటీ అవుతారు. మంగళవారం సాయంత్రం అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో 'అహ్లాన్ మోడీ' కార్యక్రమంలో 60,000 మందికి పైగా భారతీయ ప్రవాస సంఘం సభ్యులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. బుధవారం, భారత ప్రధాని మొదటగా దుబాయ్లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో పాల్గొంటారు. భారత్, టర్కీ, ఖతార్ దేశాలు 'గౌరవ అతిథి'లుగా ఉన్న ఈ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేస్తారు. బుధవారం సాయంత్రం అబు మురీఖాలోని BAPS హిందూ మందిర్ను మోదీ ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







