యూఏఈ లో భారత ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన షెడ్యూల్
- February 11, 2024
యూఏఈ: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నుంచి రెండు రోజులపాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమై అబుదాబిలో మధ్యప్రాచ్యంలోని తొలి సంప్రదాయ హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభిస్తారు. గత ఎనిమిది నెలల్లో ఆయన యూఏఈకి రావడం ఇది మూడోసారి. 2015 తర్వాత ఏడవది. ఈ పర్యటనలో మోదీ అబుదాబి మరియు దుబాయ్లలో సమావేశాలలో పాల్గొంటారు. యూఏఈ అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఒక ప్రకటనలో తెలిపింది.అలాగే వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్తోనూ మోదీ భేటీ అవుతారు. మంగళవారం సాయంత్రం అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో 'అహ్లాన్ మోడీ' కార్యక్రమంలో 60,000 మందికి పైగా భారతీయ ప్రవాస సంఘం సభ్యులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. బుధవారం, భారత ప్రధాని మొదటగా దుబాయ్లో జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024లో పాల్గొంటారు. భారత్, టర్కీ, ఖతార్ దేశాలు 'గౌరవ అతిథి'లుగా ఉన్న ఈ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేస్తారు. బుధవారం సాయంత్రం అబు మురీఖాలోని BAPS హిందూ మందిర్ను మోదీ ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









