అబుధాబి హిందూ దేవాలయం ప్రారంభోత్సవం: దుబాయ్ గురుద్వారా ద్వారా ఉచిత భోజనాలు

- February 13, 2024 , by Maagulf
అబుధాబి హిందూ దేవాలయం ప్రారంభోత్సవం: దుబాయ్ గురుద్వారా ద్వారా ఉచిత భోజనాలు

యూఏఈ: అబుధాబిలోని ఐకానిక్ BAPS హిందూ మందిర్ (ఆలయం) ప్రారంభోత్సవం రోజున 5,000 మందికి ఉచిత భోజనాలను అందజేయనున్నట్లు దుబాయ్‌లోని గురునానక్ దర్బార్ గురుద్వారా ప్రకటించింది. బుధవారం (ఫిబ్రవరి 14) మధ్యప్రాచ్యంలోని మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి ఆలయాన్ని BAPS స్వామినారాయణ్ సంస్థ యొక్క ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహారా మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అన్ని గురుద్వారాల్లో లంగర్ ద్వారా భోజనాలు అందించడం సంప్రదాయమని గురుద్వారా కమిటీ చైర్మన్ సురేందర్ సింగ్ కంధారి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com