ఆహారపదార్థాలు వేడి చేయవొద్దు
- June 29, 2015
మనం మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి వేడి చేయటం వలన ఆహారం వృథా కాదు అన్నది నిజం. సాధారణంగా ఇలా చేయటం సరి అయినదే, అలా చేయటం కొన్ని ఆహా రాలపట్ల ప్రమాదకరంగా మారుతుంది. కొన్ని ఆహార పదార్థాలను తిరిగి వేడి చేసినప్పుడు వాటిలో ఉన్న పోషకాలను కోల్పోతాయి మరియు మరికొన్ని మనకు పాయిజన్ గా మారిపోతాయి. కాబట్టి, మనము ఏ ఆహారంపట్ల తప్పుగా చేస్తున్నామో తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరియు మన కుటుంబాల ఆరోగ్యం కొరకు ఆహారపదార్థాలను వేడి చేసుకుని తినటం నివారించటం అవసరం. ఏ ఆహారపదార్థాలను నివారించాలో చూడడానికి ఈ స్లయిడ్ షోని క్లిక్ చేయండి.బంగాళ దుంపలు మీకు చాలా మంచివి; వాటిలో చాలా అధిక పోషక విలువలు ఉన్నాయి. కానీ మీరు ఎక్కువకాలం వాటిని ఫ్రిజ్ లో ఉంచితే, వాటి పోషక విలువలు మరింతగా కోల్పోయే అవకాశం ఉన్నది. వాటిని వేడిచేయటం వలన అవి విషపూరితం కావొచ్చు. ఈ రోజుల్లో చికెన్ సర్వసాధారణంగా తిరిగి వేడిచేసుకుని తినే ఆహారాలలో ఒకటి. కానీ దానిని తిరిగి వేడి చేసుకుని తినటం అన్నది చాలా అనారోగ్యకరం ఎందువలనంటే దీనిలో ప్రోటీన్ పదార్థాలు అధికంగా ఉంటాయి మరియు అవి తిరిగి వేడి చేయటం వలన జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. మీరు నిజంగా తినాలి అనుకుంటే దానిని చల్లగానే తినండి. పుట్టగొడుగులను ఎల్లప్పుడూ తయారైన వెంటనే తింటారు. మీరు వండిన తరువాత చాలాసమయం వరకు ఉంచినట్లయితే, వీటిలోని ప్రోటీన్లు మార్పు చెంది జీర్ణం కావటానికి కష్టమవుతుంది. దుంపకూరలలో నైట్రేట్ అధిక స్థాయిలో ఉంటుంది, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వీటిని తిరిగి వేడి చేసి తీసుకోకూడదు. పాలకూరను కూడా తిరిగి వేడి చేసి తినటం ప్రమాదకరం. స్పినాచ్ లో నైట్రేట్ అధిక స్థాయిలో ఉంటుంది, దీనిని తిరిగి వేడి చేసినప్పుడు పూర్తిగా నైట్రేట్ మారుతుంది. ఇది శరీరాన్ని కార్సినోజెనెటిక్ గా ఉంచుతుంది. అధిక వేడికి గురైనప్పుడు గుడ్లు విషపూరితం అవుతాయి. మీరు పగలకొట్టిన గుడ్లను తిరిగి వేడి చేసి తినవద్దు మరియు ఉడికించిన గుడ్లను కూడా తిరిగి వేడిచేసి తినవద్దు. వీటిని తిరిగి వేసిచేసి తినటం వలన మీ కడుపులో కలత మొదలవుతుంది. బచ్చలికూరలో కూడా అధికంగా నైట్రేట్ ఉండటం వలన, దీనిని తిరిగి వేడి చేయకూడదు. సాధారణంగా, ప్రజలు దీనిని సూప్ లో మరియు వేరే పదార్థాలలో వాడుతుంటారు, నేను సమస్యలను నివారించేందుకు ఈ ఆకుకూరను తొలగించి వేడి చేయటం మంచిది అని సలహా చెపుతాను.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







