తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు
- February 16, 2024
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవం కోసం మహాద్వారం నుంచి స్వామి వారి సన్నిధి వరకు పుష్పాలంకరణ చేశారు. దాదాపు 7 టన్నుల పుష్పాలను, 50 వేల కట్ ఫ్లవర్స్ ను ఉపయోగించి సుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి వాహనసేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై అర్చకులు శ్రీవారిని ఊరేగించారు.
ఉదయం 11 గంటల ప్రాంతంలో చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 గంట తర్వాత గరుడ వాహనం, మధ్యాహ్నం 2- 3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహిస్తారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









