బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్..
- February 18, 2024
మలేషియా: బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత జట్టు నిలిచింది. మలేషియాలోని సెలంగోర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో థాయ్లాండ్ జట్టును భారత్ 3-2 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. క్రీడా చరిత్రలో ప్రతిష్టాత్మకమైన కాంటినెంటల్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ను భారత్ గెలుచుకోవడం ఇదే తొలిసారి.
భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ, టీనేజ్ సంచలనం అన్మోల్ ఖర్బ్ లు తమ తమ మ్యాచుల్లో గెలుపొందారు. థామస్ కప్ను గెలుచుకున్న రెండేళ్ల తరువాత ఖండాంతర టోర్నమెంట్లో భారత్ అద్భుతంగా రాణించి చైనా, హాంకాంగ్, జపాన్, చివరికి థాయ్లాండ్లను ఓడించి కప్పును గెలుచుకుంది.
పైనల్స్లో మొదటగా సుపనిందా కతేథాంగ్ను 21-12, 21-12 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 39 నిమిషాల్లోనే ముగిసింది. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ 21-16, 18-21, 21-16తో కిటితారాకుల్-రవింద్ర ప్ర జోంగ్జాయ్ పై విజయం సాధించడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









