బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్..
- February 18, 2024
మలేషియా: బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత జట్టు నిలిచింది. మలేషియాలోని సెలంగోర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో థాయ్లాండ్ జట్టును భారత్ 3-2 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. క్రీడా చరిత్రలో ప్రతిష్టాత్మకమైన కాంటినెంటల్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ను భారత్ గెలుచుకోవడం ఇదే తొలిసారి.
భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ, టీనేజ్ సంచలనం అన్మోల్ ఖర్బ్ లు తమ తమ మ్యాచుల్లో గెలుపొందారు. థామస్ కప్ను గెలుచుకున్న రెండేళ్ల తరువాత ఖండాంతర టోర్నమెంట్లో భారత్ అద్భుతంగా రాణించి చైనా, హాంకాంగ్, జపాన్, చివరికి థాయ్లాండ్లను ఓడించి కప్పును గెలుచుకుంది.
పైనల్స్లో మొదటగా సుపనిందా కతేథాంగ్ను 21-12, 21-12 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 39 నిమిషాల్లోనే ముగిసింది. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ 21-16, 18-21, 21-16తో కిటితారాకుల్-రవింద్ర ప్ర జోంగ్జాయ్ పై విజయం సాధించడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







