బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్..
- February 18, 2024
మలేషియా: బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత జట్టు నిలిచింది. మలేషియాలోని సెలంగోర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో థాయ్లాండ్ జట్టును భారత్ 3-2 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. క్రీడా చరిత్రలో ప్రతిష్టాత్మకమైన కాంటినెంటల్ టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ను భారత్ గెలుచుకోవడం ఇదే తొలిసారి.
భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ, టీనేజ్ సంచలనం అన్మోల్ ఖర్బ్ లు తమ తమ మ్యాచుల్లో గెలుపొందారు. థామస్ కప్ను గెలుచుకున్న రెండేళ్ల తరువాత ఖండాంతర టోర్నమెంట్లో భారత్ అద్భుతంగా రాణించి చైనా, హాంకాంగ్, జపాన్, చివరికి థాయ్లాండ్లను ఓడించి కప్పును గెలుచుకుంది.
పైనల్స్లో మొదటగా సుపనిందా కతేథాంగ్ను 21-12, 21-12 తేడాతో పీవీ సింధు ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 39 నిమిషాల్లోనే ముగిసింది. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్లో గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ 21-16, 18-21, 21-16తో కిటితారాకుల్-రవింద్ర ప్ర జోంగ్జాయ్ పై విజయం సాధించడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







