జైన ముని ఆచార్య విద్యాసాగర్ జీ మహారాజ్ కన్నుమూత
- February 18, 2024
ఛత్తీస్గఢ్: జైన ముని ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్ కన్నుమూశారు.ఛత్తీస్గఢ్లోని డోంగర్ఘర్లో ఉన్న చంద్రగిరి తీర్థంలో ఉండే విద్యాసాగర్ జీ మహరాజ్.. కన్నుమూసినట్లు చంద్రగిరి తీర్థంలో ఉండే ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2.35 గంటలకు విద్యాసాగర్ జీ మహరాజ్ చనిపోయినట్లు ప్రకటించారు. అయితే గత 3 రోజుల నుంచి మహారాజ్ ఆహారం, నీరు తీసుకోవడం మానేశారని వారు వెల్లడించారు. విద్యాసాగర్ జీ మహరాజ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆచార్య విద్యాసాగర్ మహరాజ్ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. "నా ఆలోచనలు, ప్రార్థనలు ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ భక్తులతో ఉన్నాయి. సమాజానికి మహరాజ్ చేసిన అమూల్యమైన కృషికి, ముఖ్యంగా ప్రజల్లో ఆధ్యాత్మికతన పెంపొందించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య, మరిన్నింటి కోసం చేసిన కృషికి రాబోయే తరాలకు గుర్తుండిపోతాయి. ఆయన ఆశీస్సులు అందుకున్న ఘనత నాకు దక్కింది. గత ఏడాది చివర్లో ఛత్తీస్గఢ్లోని డోంగర్ఘర్లోని చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో నేను విద్యాసాగర్ జీ మహారాజ్ జీని కలిసి వారి ఆశీస్సులు కూడా పొందాను" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







