పాలస్తీనా విదేశాంగ మంత్రితో మంత్రి జైశంకర్ భేటీ
- February 19, 2024
మ్యూనిచ్: పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్ మాలికితో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ విషయాన్ని జైశంకర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో గాజాలో ప్రస్తుత పరిస్థితిపై తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. ‘పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్ మాలికితో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై అభిప్రాయాలు పంచుకున్నాం’ అని మంత్రి తెలిపారు. సమావేశానికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు. మ్యూనిచ్ భద్రతా సదస్సు నేపథ్యంలో జైశంకర్ ప్రస్తుతం జర్మనీలోని మ్యూనిచ్ పట్టణంలో ఉన్న సంగతి తెలిసిందే. శనివారం ఈ సదస్సులో జైశంకర్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ – పాలస్తీనా సమస్య పరిష్కారానికి రెండు దేశాల ఏర్పాటే పరిష్కారమని భారత్ ఎన్నో ఏళ్ల నుంచి చెబుతున్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









