పాలస్తీనా విదేశాంగ మంత్రితో మంత్రి జైశంకర్ భేటీ
- February 19, 2024
మ్యూనిచ్: పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్ మాలికితో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం సమావేశమయ్యారు. ఈ విషయాన్ని జైశంకర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో గాజాలో ప్రస్తుత పరిస్థితిపై తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. ‘పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్ మాలికితో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉంది. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై అభిప్రాయాలు పంచుకున్నాం’ అని మంత్రి తెలిపారు. సమావేశానికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు. మ్యూనిచ్ భద్రతా సదస్సు నేపథ్యంలో జైశంకర్ ప్రస్తుతం జర్మనీలోని మ్యూనిచ్ పట్టణంలో ఉన్న సంగతి తెలిసిందే. శనివారం ఈ సదస్సులో జైశంకర్ మాట్లాడుతూ ఇజ్రాయిల్ – పాలస్తీనా సమస్య పరిష్కారానికి రెండు దేశాల ఏర్పాటే పరిష్కారమని భారత్ ఎన్నో ఏళ్ల నుంచి చెబుతున్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







