బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జూన్ వరకు పొడిగింపు
- February 19, 2024
న్యూ ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ (BJP) హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2024 జూన్ వర కూ పొడిగించింది. 2020లో అమిత్ నుంచి పార్టీ అధ్యక్ష పగ్గాలను నడ్డా తీసుకున్నారు. ఆయన పదవీ కాలాన్ని పొడి గించాలనే ప్రతిపాదన గత జనవరిలో అమితా చేయగా, దీనికి బీజేపీ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయంతో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం నడ్డాకు ఉంటుంది. అయితే, ఆ తర్వాత దానికి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. జేపీ నడ్డా అధ్యక్షుడిగా బీజేపీ పలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో పార్టీని ఆయన విజయ తీరాల కు చేర్చారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమా వేశాల రెండోరోజైన ఆదివారం నాడు నడ్డా పదవీ కాలం పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో వేలాది మంది పార్టీ కార్య కర్తలు, అగ్రనేతలు పాల్గొన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, ప్రచార అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







