లాస్ ఏంజిల్స్లో 'మెగాస్టార్' చిరంజీవికి ఘన సన్మానం!
- February 19, 2024
అమెరికా: కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
సినీ కళామతల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా చిరుకు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోనున్నారు. ఇప్పటికే పద్మవిభూషణుడు చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించగా.. తాజాగా లాస్ ఏంజిల్స్లో తెలుగు అభిమానులు కూడా ఘనంగా సన్మానించారు.
అమెరికాలోని మెగా ఫాన్స్ ‘మెగా ఫెలిసిటేషన్ ఈవెంట్’ను ఆదివారం లాస్ ఏంజిల్స్లో నిర్వహించారు. ఈ ఈవెంట్లో ‘పద్మ విభూషణ్’ గ్రహీత చిరంజీవిని ఘనంగా సత్కరించారు. పుష్ప గుచ్చాలు ఇచ్చి.. శాలువాలతో చిరుకి తెలుగు ఫాన్స్, మెగా ఫాన్స్ సన్మానం చేశారు. తనను సత్కరించిన అభిమానులకు మెగాస్టార్ ధన్యవాదాలు చెప్పారు. తనపై కురిపిస్తున్న ఈ ప్రేమ, అభిమానానికి చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









