అబార్షన్ పై చట్టంలో యూఏఈ సవరణలు
- February 19, 2024
యూఏఈ: ఇప్పటికే ఉన్న యూఏఈ చట్టానికి సవరణలు చేశారు. ఇది తల్లి ప్రాణాలకు తీవ్ర ప్రమాదంలో ఉంటే అబార్షన్ చేయడాన్ని వైద్య నిపుణులకు సులభతరం చేస్తుంది. దేశంలోని న్యాయవాదుల ప్రకారం.. ఈ ముఖ్యమైన మార్పు గర్భిణీ స్త్రీని ఆమె ఆరోగ్యానికి బాధ్యత వహిస్తుంది. "అబార్షన్ ఆపరేషన్ (ఇతర షరతులతో పాటు) ప్రారంభించడానికి గర్భిణీ స్త్రీ యొక్క సమ్మతి మాత్రమే అవసరం. ఆమె భర్త కాదు అని నిర్ధారించడానికి చట్టంలోని సవరణలు మునుపటి నిబంధనలను అప్డేట్ చేశారు." అని BSA అహ్మద్ బిన్లోని సీనియర్ అసోసియేట్ హడియెల్ హుస్సేన్ అన్నారు. కొత్త నిబంధన ప్రకారం.. స్త్రీ సమ్మతి ఇవ్వలేని పరిస్థితిలో స్త్రీ యొక్క భర్త లేదా, భర్త లేనప్పుడు వ్యక్తిగత స్థితి చట్టం ప్రకారం నిర్వచించబడిన ఆమె మగ బంధువులు అబార్షన్ ఆపరేషన్కు అనుమతిని ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అయితే, చట్టం ప్రకారం తక్షణ శస్త్రచికిత్స అవసరమయ్యే అత్యవసర సందర్భాలలో సమ్మతి నిబంధనలకు సడలింపు ఇచ్చారు. గర్భం యొక్క కొనసాగింపు గర్భిణీ స్త్రీ జీవితానికి ప్రమాదం కలిగిస్తే.. పిండంలో వైకల్యం ఉంటే మాత్రమే వైద్య నిపుణులు గర్భస్రావం చేయడానికి అనుమతించబడతారు. మంఖూల్లోని ఆస్టర్ హాస్పిటల్లోని మెటర్నిటి డాక్టర్ సుస్మితా దాస్ మాట్లాడుతూ.. యూఏఈ చట్టంలో ఇటీవలి మార్పులను స్వాగతించారు. ఇప్పుడు యూఏఈ ఒంటరి తల్లులను దేశంలో ప్రసవించటానికి అనుమతించిందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







