వ్యాపారాలలో ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రతిపాదన తిరస్కరణ
- February 19, 2024
బహ్రెయిన్: ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు కూడా నిర్వహించుకునే ప్రతిపాదనను షూరా కౌన్సిల్ తిరస్కరించే అవకాశం ఉంది. ఈ మేరకు నేషనల్ అసెంబ్లీ అని పిలువబడే ప్రతినిధుల కౌన్సిల్ మరియు షురా కౌన్సిల్ ఉమ్మడి సెషన్లో ఓటింగ్ జరిగింది. షురా కౌన్సిల్లో ఆదివారం జరిగిన సమావేవంలో ప్రతిపాదనపై చర్చించారు. లాభ నష్టాలను పార్లమెంటరీ కమిటీ నివేదికపై మొదటగా చర్చించారు. ఎంపి డాక్టర్ మహమ్మద్ అలీ అల్ ఖుజాయ్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వ ఉద్యోగులను పని చేస్తూనే వ్యాపారాలలో నిమగ్నమవ్వాలనే ప్రతిపాదనతో విభేదిస్తున్నట్లు పేర్కొంది. పరస్పర ప్రయోజనం, ఆర్థిక హాని, భద్రతా ప్రమాదాలు, నియంత్రణ అసమతుల్యత, సంబంధిత సంస్థల అభ్యంతరం వంటి అంశాలు తలెత్తే అవకాశం ఉందని తన నివేదికలో కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సౌదీ అరేబియా, జోర్డాన్, కువైట్, ఖతార్ మరియు లిబియాలో వ్యాపారాలు నిర్వేహించకుండా ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధం ఉందని కమిటీ పేర్కొంది. ప్రతిపాదనను తిరస్కరించాలని సిఫార్సు చేసింది. షురా కౌన్సిల్ సభ్యులలో ఎక్కువ మంది ప్రతిపాదనను అనుమతించడానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రతిపాదన వీగిపోయింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







