తిరుమల శ్రీవారి ‘మే’ నెల టికెట్లు విడుదల
- February 19, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను సోమవారం టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది. బుధవారం పది గంటల వరకు సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని టిటిడి అధికారులు తెలిపారు.లక్కీడిప్ పొందినవారు అదే రోజు మధ్యాహ్నాం 12 గంటలలోపు రుసుము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని వెల్లడించారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, వర్చువల్ సేవా టికెట్ల కోటాను 22వ తేదీ ఉదయం పది గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లు మధ్యాహ్నం మూడు గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటా 23న ఉదయం పది గంటలకు, శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300 టికెట్లు కోటాను 24న విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









