ప్రపంచంలోనే అత్యంత బిజీ విమానాశ్రయంలో ఎన్నారైల అరుదైన రికార్డు..!
- February 19, 2024
దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయం అయిన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయులు మరో రికార్డు సృష్టించారు. గతేడాది ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులే అత్యధికంగా దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు. మొత్తం 11.9 మంది భారతీయులు రాకపోకలు సాగించినట్టు దుబాయ్ విమానాశ్రయం తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా, ప్రయాణికుల సంఖ్యాపరంగా ఎయిర్పోర్టు దాదాపుగా కరోనా పూర్వపు స్థితికి చేరుకుందని వెల్లడించింది.
విమానాశ్రయం అధికారులు తెలిపిన వివారల ప్రకారం, గతేడాది మొత్తం 86,994,365 మంది ప్రయాణికులు దుబాయ్ మీదుగా రాకపోకలు సాగించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 31.7 శాతం అధికం. 2019 నాటి గరిష్ఠంతో పోలిస్తే ఇది ఒకశాతం ఎక్కువ. ముఖ్యంగా గతేడాది ద్వితీయార్థంలో ప్రయాణికుల రాకపోకల్లో గణీయ వృద్ధి కనిపించిందని దుబాయ్ ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. డిసెంబర్లో ప్రయాణికుల రాకపోకలు గరిష్ఠస్థాయికి (7.9 మిలియన్) తాకాయి.
ఇక దేశాల వారీగా చూస్తే అత్యధికంగా11.9 మిలియన్ మంది భారతీయులు దుబాయ్ మీదుగా ప్రయాణించారు. ఆ తరువాత స్థానంలో సౌదీ అరేబియా వాళ్లు ఉన్నారు. 6.7 మిలియన్ల సౌదీ వాసులు దుబాయ్ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించారు. 5.9 మిలియన్ల ప్రయాణికులతో బ్రిటన్ మూడోస్థానంలో నిలిచింది.
ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయం ద్వారా 104 దేశాల్లోని 262 గమ్యస్థానాలకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మొత్తం 102 అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఈ విమానాశ్రయంలో విమాన సర్వీసులు అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







