తేజు ‘గాంజా శంకర్’.! అసలేం జరుగుతోందట.!
- February 19, 2024‘విరూపాక్ష’ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గాంజా శంకర్’. ఊర మాస్ క్యారెక్టర్లో సాయి ధరమ్ తేజ్ నటించబోతున్నాడు ఈ సినిమాలో.
మాస్ డైరెక్టర్గా పేరున్న సంపత్ నంది ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే, బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం జరిగింది.
కానీ, తాజాగా తెలంగాణా నార్కోటిక్స్ బ్యూరో నుంచి ‘గాంజా శంకర్’ నిర్మాతలకు నోటీసులు అందాయని సమాచారం. ఈ సినిమాలోని కంటెంట్ యూత్ని పాడు చేసే విధంగా వుందంటూ.. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం మంచిది కాదనీ, వెంటనే ఆపేయాలని నోటీసులిచ్చారట.
అయితే, ఈ విషయమై ఇంకా ‘గాంజా శంకర్’ టీమ్ స్పందించలేదు. ఆ మాటకొస్తే.. అంతకు ముందు జరిగిన సినిమా ఆగిపోయిందన్న ప్రచారంలోనూ టీమ్ ఎటువంటి స్పందనా ఇవ్వలేదు.
అసలు ‘గాంజా శంకర్’ విషయంలో ఏం జరుగుతోంది. అసలే ‘విరూపాక్ష’తో హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం కావడంతో.. తేజు ఫ్యాన్స్లో ఆందోళన నెలకొంది.
ఈ ప్రచారాలపై అడ్డుకట్ట వేసేలా టీమ్ స్పందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి. ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..