పసిడి ధర తగ్గింది

- June 02, 2016 , by Maagulf
పసిడి ధర తగ్గింది

రెండు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర గురువారం తగ్గింది. దేశీయంగా రూ.135 తగ్గడంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29వేల మార్కు నుంచి దిగి వచ్చి రూ.28,865కి చేరింది. నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి కీలక సమయాల్లో కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం వల్ల దీని ధరతగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.21శాతం పెరిగి 1,215.30 యూఎస్‌ డాలర్లకు చేరింది.గురువారం వెండి ధర సైతం తగ్గింది. రూ.160 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.38,600కి చేరింది. అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 0.19శాతం పెరగడంతో 15.95 యూఎస్‌ డాలర్లకు చేరింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com