పసిడి ధర తగ్గింది
- June 02, 2016
రెండు రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర గురువారం తగ్గింది. దేశీయంగా రూ.135 తగ్గడంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29వేల మార్కు నుంచి దిగి వచ్చి రూ.28,865కి చేరింది. నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి కీలక సమయాల్లో కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం వల్ల దీని ధరతగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.21శాతం పెరిగి 1,215.30 యూఎస్ డాలర్లకు చేరింది.గురువారం వెండి ధర సైతం తగ్గింది. రూ.160 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.38,600కి చేరింది. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.19శాతం పెరగడంతో 15.95 యూఎస్ డాలర్లకు చేరింది
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







