భారత్, చైనా మధ్య తాజా కమాండర్ స్థాయి చర్చలు..
- February 21, 2024
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట సహా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్, చైనా అంగీకరించాయి. ఈ వారంలో జరిగిన అత్యున్నత స్థాయి సైనిక చర్చల్లో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. అయితే, చర్చల్లో మూడేన్నరేళ్లుగా కొనసాగుతున్న వివాద పరిష్కారంపై స్పష్టమైన ముగింపును కనుగొనలేకపోయారు. భారత్-చైనా మధ్య 21వ కార్ఫ్స్ కమాండర్స్థాయి చర్చలు ఈ నెల 13న చుషుల్-మోల్డో బోర్డర్లో మీటింగ్ పాయింట్లో జరిగినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యాలను ఉపసంహరించుకోవడంపై గత పర్యటనల్లో జరిగిన చర్చలు భారత్-చైనా మధ్య సరిహద్దులో శాంతికి ముఖ్యమైన ప్రాతిపదిక అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. చర్చల సందర్భంగా ఇరుదేశాలు తమ అభిప్రాయాలను పరస్పరం స్నేహపూర్వకంగా ముందుంచాయని తెలిపింది. మధ్యంతర కాలంలో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు ఇరు పక్షాలు కట్టుబడి ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







