భారత్, చైనా మధ్య తాజా కమాండర్ స్థాయి చర్చలు..
- February 21, 2024
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట సహా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్, చైనా అంగీకరించాయి. ఈ వారంలో జరిగిన అత్యున్నత స్థాయి సైనిక చర్చల్లో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. అయితే, చర్చల్లో మూడేన్నరేళ్లుగా కొనసాగుతున్న వివాద పరిష్కారంపై స్పష్టమైన ముగింపును కనుగొనలేకపోయారు. భారత్-చైనా మధ్య 21వ కార్ఫ్స్ కమాండర్స్థాయి చర్చలు ఈ నెల 13న చుషుల్-మోల్డో బోర్డర్లో మీటింగ్ పాయింట్లో జరిగినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యాలను ఉపసంహరించుకోవడంపై గత పర్యటనల్లో జరిగిన చర్చలు భారత్-చైనా మధ్య సరిహద్దులో శాంతికి ముఖ్యమైన ప్రాతిపదిక అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. చర్చల సందర్భంగా ఇరుదేశాలు తమ అభిప్రాయాలను పరస్పరం స్నేహపూర్వకంగా ముందుంచాయని తెలిపింది. మధ్యంతర కాలంలో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు ఇరు పక్షాలు కట్టుబడి ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







