భారత్, చైనా మధ్య తాజా కమాండర్ స్థాయి చర్చలు..
- February 21, 2024
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట సహా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్, చైనా అంగీకరించాయి. ఈ వారంలో జరిగిన అత్యున్నత స్థాయి సైనిక చర్చల్లో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. అయితే, చర్చల్లో మూడేన్నరేళ్లుగా కొనసాగుతున్న వివాద పరిష్కారంపై స్పష్టమైన ముగింపును కనుగొనలేకపోయారు. భారత్-చైనా మధ్య 21వ కార్ఫ్స్ కమాండర్స్థాయి చర్చలు ఈ నెల 13న చుషుల్-మోల్డో బోర్డర్లో మీటింగ్ పాయింట్లో జరిగినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యాలను ఉపసంహరించుకోవడంపై గత పర్యటనల్లో జరిగిన చర్చలు భారత్-చైనా మధ్య సరిహద్దులో శాంతికి ముఖ్యమైన ప్రాతిపదిక అని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. చర్చల సందర్భంగా ఇరుదేశాలు తమ అభిప్రాయాలను పరస్పరం స్నేహపూర్వకంగా ముందుంచాయని తెలిపింది. మధ్యంతర కాలంలో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు ఇరు పక్షాలు కట్టుబడి ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









