రమదాన్ లోపు ముగియనున్న వార్షిక పరీక్షలు!
- February 22, 2024
యూఏఈ: యూఏఈలోని చాలా పాఠశాలలు రమదాన్ ప్రారంభానికి ముందే అంతర్గత పరీక్షలు పూర్తి అవుతాయి. మార్చి 12న దేశంలో పవిత్ర మాసం ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. రమదాన్ లోపు వార్షిక పరీక్షలను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు ఇంటెన్సివ్ స్టడీ కాకుండా కుటుంబానికి మరియు ప్రార్థనకు తగినంత సమయాన్ని కేటాయించడానికి మద్దతు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మోటర్ సిటీలోని GEMS మెట్రోపోల్ స్కూల్ ప్రిన్సిపాల్, సీఈఓ నవ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. తాము ప్రస్తుతం మా 11, 12 మరియు 13 సంవత్సరాల విద్యార్థులకు మాక్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు రమదాన్ లేదా పవిత్ర మాసంలో విద్యార్థులపై అదనపు ఒత్తిడిని కలిగించవని పేర్కొన్నారు. అదేవిధంగా, రమదాన్ ప్రారంభానికి ముందే చిన్న తరగతుల విద్యార్థుల వార్షిక పరీక్షలు పూర్తవుతాయని GEMS వెల్లింగ్టన్ అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ హెలెన్ హర్ఫోర్డ్ తెలిపారు. రమదాన్ తో సమానంగా పురస్కరించుకొని దాదాపు 10 రోజుల సమ్మర్ విరామం ఉంటుందని, అంతర్గత పరీక్షలు మార్చి 6 నాటికి ముగుస్తాయని,సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలు ఏప్రిల్ 2న ముగుస్తాయని ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ (DPS) దుబాయ్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ రష్మీ నంద్కెయోలియార్ వెల్లడించారు. "ప్రీ-ప్రైమరీ విద్యార్థులు మార్చి 11 నుండి తమ సెలవులను ఆనందిస్తారు, 1 నుండి 8 తరగతులకు సెలవులు మార్చి 18 నుండి ప్రారంభమవుతాయి. విద్యార్థులు ఏప్రిల్ 1 న పాఠశాలకు తిరిగి వస్తారు. ఇది 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతులు ప్రారంభం అవుతాయి." అని నంద్కెయోలియార్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







