మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- February 22, 2024
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 28వ ఎడిషన్ బుధవారం ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ బుక్ ఫెయిర్ మార్చి 2 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో దేవాదాయ, మతపరమైన వ్యవహారాల మంత్రి డాక్టర్ మహమ్మద్ సైద్ అల్ మమారి ముఖ్య అతిథి పాల్గొన్నారు. ఈ వేడుకకు సమాచార శాఖ మంత్రి, మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ప్రధాన కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా నాసర్ అల్ హర్రాసి హాజరయ్యారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో విద్యా సదస్సులు, ఉపన్యాసాలు, కవిత్వ సాయంత్రాలు మరియు చర్చా ప్యానెల్లు నిర్వహిస్తున్నారు. ఇందులో మేధావులు, రచయితలు మరియు సాహితీవేత్తలు పాల్గొంటారు. ప్రదర్శనలో పురాతన వస్తువులు, శిల్పాలు, మాన్యుస్క్రిప్ట్లు, గవర్నరేట్ చరిత్రకు సంబంధించిన విలక్షణమైన పత్రాలు, పర్యాటక ల్యాండ్మార్క్లపై దృశ్య ప్రదర్శనలు ఉన్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఒమన్ యూత్ ఎన్సైక్లోపీడియా (OYE)ని కూడా ప్రారంభించారు . పుస్తక ప్రదర్శనలో 34 దేశాల నుండి 847 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. బుక్ ఫెయిర్ వెబ్సైట్లో దాదాపు 269,000 అరబిక్ పుస్తకాలు, 200,000 విదేశీ పుస్తకాలు సహా 622,000 శీర్షికలు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







