మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- February 22, 2024
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 28వ ఎడిషన్ బుధవారం ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైంది. ఈ బుక్ ఫెయిర్ మార్చి 2 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో దేవాదాయ, మతపరమైన వ్యవహారాల మంత్రి డాక్టర్ మహమ్మద్ సైద్ అల్ మమారి ముఖ్య అతిథి పాల్గొన్నారు. ఈ వేడుకకు సమాచార శాఖ మంత్రి, మస్కట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ప్రధాన కమిటీ చైర్మన్ డాక్టర్ అబ్దుల్లా నాసర్ అల్ హర్రాసి హాజరయ్యారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో విద్యా సదస్సులు, ఉపన్యాసాలు, కవిత్వ సాయంత్రాలు మరియు చర్చా ప్యానెల్లు నిర్వహిస్తున్నారు. ఇందులో మేధావులు, రచయితలు మరియు సాహితీవేత్తలు పాల్గొంటారు. ప్రదర్శనలో పురాతన వస్తువులు, శిల్పాలు, మాన్యుస్క్రిప్ట్లు, గవర్నరేట్ చరిత్రకు సంబంధించిన విలక్షణమైన పత్రాలు, పర్యాటక ల్యాండ్మార్క్లపై దృశ్య ప్రదర్శనలు ఉన్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఒమన్ యూత్ ఎన్సైక్లోపీడియా (OYE)ని కూడా ప్రారంభించారు . పుస్తక ప్రదర్శనలో 34 దేశాల నుండి 847 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. బుక్ ఫెయిర్ వెబ్సైట్లో దాదాపు 269,000 అరబిక్ పుస్తకాలు, 200,000 విదేశీ పుస్తకాలు సహా 622,000 శీర్షికలు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









