క్రాకర్స్ విక్రయం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- February 22, 2024
కువైట్: జహ్రా గవర్నరేట్లోని పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ అధికారులు కబ్ద్ ప్రాంతంలో పటాకులు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆ ప్రాంతంలోని మొబైల్ కిరాణా దుకాణాలు మరియు వీధి వ్యాపారులపై బృందం తనిఖీలు నిర్వహించింది. చట్టాన్ని ఉల్లంఘించి నిర్వహిస్తున్న అనేక మొబైల్ కిరాణా దుకాణాలను మూయించింది. జాతీయ దినోత్సవ వేడుకలకు ముందు కువైట్ అన్ని రకాల బాణసంచా, వాటర్ పిస్టన్, వాటర్ బెలూన్లు మొదలైన వాటి అమ్మకాలను నిషేధించింది. ఇదిలావుండగా ప్రత్యేకంగా వేడుకల సమయంలో వాటర్ బెలూన్లను ఉపయోగించే వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సలేం అల్-నవాఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







