వివాదాస్పద వ్యాఖ్యలు.! లీగల్ నోటీసులు పంపిన త్రిష.!
- February 22, 2024ఓ రాజకీయ ప్రముఖుడు సినీ నటి త్రిషనుద్దేశించి జుగుప్పాకరమైన వ్యాఖ్యలు చేశాడు. దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయ్. సోషల్ మీడియా వేదికగా త్రిష ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాదు, పరువు నష్టం దావా వేస్తూ.. సదరు రాజకీయ ప్రముఖునికి లీగల్ నోటీసులు పంపించింది. ఈ విషయమై పలువురు సినీ సెలబ్రిటీలు త్రిషకు అండగా నిలిచారు.
కాగా, గతంలో సహ నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై ఇలాగే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశమై మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు టాలీవుడ్ నటీనటులు త్రిషకు అండగా నిలిచారు.
ఆ కేసులో న్యాయస్థానం మన్సూర్ అలీ ఖాన్కి చివాట్లు కూడా పెట్టింది. తదనంతరం ఆ సీనియర్ నటుడు త్రిషకు క్షమాపణలు చెప్పారు. తాజాగా మరోసారి త్రిష రాజకీయ ప్రముఖునిచే ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు ఫేస్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నిజానికి తన ప్రమేయం లేకుండానే త్రిష ఈ తరహా వివాదాల్లో ఇరుక్కుంటూ వుంటుంది. చాలా కాలం క్రితం త్రిష న్యూడ్ వీడియో కూడా అప్పట్లో సంచలనాత్మకమైంది. ప్రస్తుతం సీనియర్ నటీ మణుల్లో త్రిష చాలా బిజీయెస్ట్ హీరోయిన్ అని చెప్పొచ్చు.
వయసుతో సంబంధం లేకుండా కెరీర్లో బిజీగా గడుపుతోంది. మెగాస్టార్ చిరంజీవి తాజా మూవీ ‘విశ్వంభర’ సినిమాలో త్రిష నటిస్తోంది.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..