వివాదాస్పద వ్యాఖ్యలు.! లీగల్ నోటీసులు పంపిన త్రిష.!
- February 22, 2024
ఓ రాజకీయ ప్రముఖుడు సినీ నటి త్రిషనుద్దేశించి జుగుప్పాకరమైన వ్యాఖ్యలు చేశాడు. దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయ్. సోషల్ మీడియా వేదికగా త్రిష ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాదు, పరువు నష్టం దావా వేస్తూ.. సదరు రాజకీయ ప్రముఖునికి లీగల్ నోటీసులు పంపించింది. ఈ విషయమై పలువురు సినీ సెలబ్రిటీలు త్రిషకు అండగా నిలిచారు.
కాగా, గతంలో సహ నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై ఇలాగే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశమై మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు టాలీవుడ్ నటీనటులు త్రిషకు అండగా నిలిచారు.
ఆ కేసులో న్యాయస్థానం మన్సూర్ అలీ ఖాన్కి చివాట్లు కూడా పెట్టింది. తదనంతరం ఆ సీనియర్ నటుడు త్రిషకు క్షమాపణలు చెప్పారు. తాజాగా మరోసారి త్రిష రాజకీయ ప్రముఖునిచే ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు ఫేస్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నిజానికి తన ప్రమేయం లేకుండానే త్రిష ఈ తరహా వివాదాల్లో ఇరుక్కుంటూ వుంటుంది. చాలా కాలం క్రితం త్రిష న్యూడ్ వీడియో కూడా అప్పట్లో సంచలనాత్మకమైంది. ప్రస్తుతం సీనియర్ నటీ మణుల్లో త్రిష చాలా బిజీయెస్ట్ హీరోయిన్ అని చెప్పొచ్చు.
వయసుతో సంబంధం లేకుండా కెరీర్లో బిజీగా గడుపుతోంది. మెగాస్టార్ చిరంజీవి తాజా మూవీ ‘విశ్వంభర’ సినిమాలో త్రిష నటిస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









