వివాదాస్పద వ్యాఖ్యలు.! లీగల్ నోటీసులు పంపిన త్రిష.!
- February 22, 2024
ఓ రాజకీయ ప్రముఖుడు సినీ నటి త్రిషనుద్దేశించి జుగుప్పాకరమైన వ్యాఖ్యలు చేశాడు. దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయ్. సోషల్ మీడియా వేదికగా త్రిష ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాదు, పరువు నష్టం దావా వేస్తూ.. సదరు రాజకీయ ప్రముఖునికి లీగల్ నోటీసులు పంపించింది. ఈ విషయమై పలువురు సినీ సెలబ్రిటీలు త్రిషకు అండగా నిలిచారు.
కాగా, గతంలో సహ నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై ఇలాగే అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశమై మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు టాలీవుడ్ నటీనటులు త్రిషకు అండగా నిలిచారు.
ఆ కేసులో న్యాయస్థానం మన్సూర్ అలీ ఖాన్కి చివాట్లు కూడా పెట్టింది. తదనంతరం ఆ సీనియర్ నటుడు త్రిషకు క్షమాపణలు చెప్పారు. తాజాగా మరోసారి త్రిష రాజకీయ ప్రముఖునిచే ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు ఫేస్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నిజానికి తన ప్రమేయం లేకుండానే త్రిష ఈ తరహా వివాదాల్లో ఇరుక్కుంటూ వుంటుంది. చాలా కాలం క్రితం త్రిష న్యూడ్ వీడియో కూడా అప్పట్లో సంచలనాత్మకమైంది. ప్రస్తుతం సీనియర్ నటీ మణుల్లో త్రిష చాలా బిజీయెస్ట్ హీరోయిన్ అని చెప్పొచ్చు.
వయసుతో సంబంధం లేకుండా కెరీర్లో బిజీగా గడుపుతోంది. మెగాస్టార్ చిరంజీవి తాజా మూవీ ‘విశ్వంభర’ సినిమాలో త్రిష నటిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







