యాక్షన్ గాళ్గా మారనున్న కియారా అద్వానీ.!
- February 22, 2024
తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తొలి సినిమాకే క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. అయితే, రెండో సినిమా ‘వినయ విధేయ రామ’తో అవుట్ అయిపోయింది.
ఆ తర్వాత బాలీవుడ్లో కియారా అద్వానీ అదృష్టం చెక్ చేసుకుంది. అప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన కియారాకి, తెలుగు ఎంట్రీ తర్వాత బాలీవుడ్ బాగా కలిసొచ్చింది.
‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ ఖాన్’ సినిమాతో అక్కడ సెన్సేషనల్ అయిపోయింది. ఆ తర్వాత చాలా తక్కువ టైమ్లోనే స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.
ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతోన్న కియారా అద్వానీ, తాజాగా రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందుతోన్న ‘డాన్ 3’ లో హీరోయిన్గా ఎంపికైంది.
ఈ సినిమా కోసం యాక్షన్ గాళ్ అవతారమెత్తబోతోందట కియారా అద్వానీ. హీరోతో సమానంగా యాక్షన్ ఎపిసోడ్స్లో నటించేందుకు సిద్ధమవుతోందట.
అన్నట్లు తెలుగులో మళ్లీ కియారా అద్వానీ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయ్.
తాజా వార్తలు
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం









