యాక్షన్ గాళ్గా మారనున్న కియారా అద్వానీ.!
- February 22, 2024తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తొలి సినిమాకే క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. అయితే, రెండో సినిమా ‘వినయ విధేయ రామ’తో అవుట్ అయిపోయింది.
ఆ తర్వాత బాలీవుడ్లో కియారా అద్వానీ అదృష్టం చెక్ చేసుకుంది. అప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన కియారాకి, తెలుగు ఎంట్రీ తర్వాత బాలీవుడ్ బాగా కలిసొచ్చింది.
‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ ఖాన్’ సినిమాతో అక్కడ సెన్సేషనల్ అయిపోయింది. ఆ తర్వాత చాలా తక్కువ టైమ్లోనే స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.
ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతోన్న కియారా అద్వానీ, తాజాగా రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందుతోన్న ‘డాన్ 3’ లో హీరోయిన్గా ఎంపికైంది.
ఈ సినిమా కోసం యాక్షన్ గాళ్ అవతారమెత్తబోతోందట కియారా అద్వానీ. హీరోతో సమానంగా యాక్షన్ ఎపిసోడ్స్లో నటించేందుకు సిద్ధమవుతోందట.
అన్నట్లు తెలుగులో మళ్లీ కియారా అద్వానీ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయ్.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..