యాక్షన్ గాళ్గా మారనున్న కియారా అద్వానీ.!
- February 22, 2024
తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తొలి సినిమాకే క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. అయితే, రెండో సినిమా ‘వినయ విధేయ రామ’తో అవుట్ అయిపోయింది.
ఆ తర్వాత బాలీవుడ్లో కియారా అద్వానీ అదృష్టం చెక్ చేసుకుంది. అప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన కియారాకి, తెలుగు ఎంట్రీ తర్వాత బాలీవుడ్ బాగా కలిసొచ్చింది.
‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ ఖాన్’ సినిమాతో అక్కడ సెన్సేషనల్ అయిపోయింది. ఆ తర్వాత చాలా తక్కువ టైమ్లోనే స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.
ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతోన్న కియారా అద్వానీ, తాజాగా రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందుతోన్న ‘డాన్ 3’ లో హీరోయిన్గా ఎంపికైంది.
ఈ సినిమా కోసం యాక్షన్ గాళ్ అవతారమెత్తబోతోందట కియారా అద్వానీ. హీరోతో సమానంగా యాక్షన్ ఎపిసోడ్స్లో నటించేందుకు సిద్ధమవుతోందట.
అన్నట్లు తెలుగులో మళ్లీ కియారా అద్వానీ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయ్.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







