యాక్షన్ గాళ్గా మారనున్న కియారా అద్వానీ.!
- February 22, 2024
తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తొలి సినిమాకే క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది. అయితే, రెండో సినిమా ‘వినయ విధేయ రామ’తో అవుట్ అయిపోయింది.
ఆ తర్వాత బాలీవుడ్లో కియారా అద్వానీ అదృష్టం చెక్ చేసుకుంది. అప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన కియారాకి, తెలుగు ఎంట్రీ తర్వాత బాలీవుడ్ బాగా కలిసొచ్చింది.
‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ ఖాన్’ సినిమాతో అక్కడ సెన్సేషనల్ అయిపోయింది. ఆ తర్వాత చాలా తక్కువ టైమ్లోనే స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.
ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతోన్న కియారా అద్వానీ, తాజాగా రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందుతోన్న ‘డాన్ 3’ లో హీరోయిన్గా ఎంపికైంది.
ఈ సినిమా కోసం యాక్షన్ గాళ్ అవతారమెత్తబోతోందట కియారా అద్వానీ. హీరోతో సమానంగా యాక్షన్ ఎపిసోడ్స్లో నటించేందుకు సిద్ధమవుతోందట.
అన్నట్లు తెలుగులో మళ్లీ కియారా అద్వానీ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయ్.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









