హైదరాబాద్ లో పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు
- February 22, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు నేడు దాడులు నిర్వహించారు. సికింద్రాబాద్, మెహదీపట్నం, మల్కాజ్ గిరి, హిమాయత్ నగర్, లక్డీకాపూల్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురిలోని 9 బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో ప్రమాణాలకు తిలోదకాలిచ్చి నాసిరకం వస్తువులు ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. అంతేకాదు, రక్తం సేకరించడం నుంచి పంపిణీ వరకు అనేక అవకతవకలు జరుగుతున్న విషయం గుర్తించారు.
రక్తం సేకరించిన తర్వాత అందులోని ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వ చేసే సమయంలో లోపాలు ఉండడం వల్ల, ఆ రక్తం ఎక్కించిన రోగులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పలు బ్లడ్ బ్యాంకులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అధికారులు దాడులు చేసిన బ్లడ్ బ్యాంకులు ఇవే…!
శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్ (మల్కాజ్ గిరి)
- ఎంఎస్ఎన్ బ్లడ్ సెంటర్ (ఉప్పల్)
- నవజీవన్ బ్లడ్ సెంటర్ (చైతన్యపురి)
- నంది బ్లడ్ సెంటర్ (బాలానగర్)
- ఏవీఎస్ బ్లడ్ సెంటర్ (లక్డీకాపూల్)
- వివేకానంద బ్లడ్ సెంటర్ (మెహదీపట్నం)
- రుధిర వాలంటరీ బ్లడ్ సెంటర్ (హిమాయత్ నగర్)
- తలసేమియా రక్షిత బ్లడ్ సెంటర్ (కోఠి)
- ప్రతిమ సాయి బ్లడ్ సెంటర్ (సికింద్రాబాద్)
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







