ఐపీఎల్ షెడ్యూల్ అవుట్..!
- February 22, 2024
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 17వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడనుంది.
ఈ మ్యాచ్ మార్చి 22న ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుతో చెన్నై తలపడనుంది. మొదట 21 మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. చెన్నై జట్టు తొలి మ్యాచ్ని తొమ్మిదోసారి ఆడనుంది. ఇంతకుముందు, జట్టు 2009, 2011, 2012, 2018, 2019, 2020, 2022 ,2023లో ప్రారంభ మ్యాచ్ను ఆడింది.
ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి రెండు మ్యాచ్లను విశాఖపట్నంలో ఆడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది, ఆ తర్వాత వెంటనే ఐపీఎల్కు గ్రౌండ్ను సిద్ధం చేయడానికి సమయం పడుతుంది. ఈ కారణంగానే ఢిల్లీ తొలి రెండు మ్యాచ్లు విశాఖపట్నంలో జరగనున్నాయి. దేశంలో ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కాలేదు. 15 రోజుల షెడ్యూల్ మాత్రమే బయటకు వచ్చింది. లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ విడుదల కానుంది.
మొత్తం టోర్నీ భారత్లోనే జరుగుతుందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. 2009లో మాత్రమే ఐపీఎల్ పూర్తిగా విదేశాల్లో (దక్షిణాఫ్రికా) ఆడగా, 2014లో సాధారణ ఎన్నికల కారణంగా యూఏఈలో కొన్ని మ్యాచ్లు జరిగాయి. అయితే, 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ టోర్నీని భారత్లోనే నిర్వహించారు. ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న దృష్ట్యా, ఫైనల్ మే 26న జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







