ఎమ్మెల్యే లాస్య నందిత పోస్టుమార్టం పూర్తి..సాయంత్రం అంత్యక్రియలు
- February 23, 2024
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత..శుక్రవారం ఉదయం పటాన్చెరూ సమీపంలోని ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీ కొట్టడంతో.. తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు.
దీంతో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. శవపరీక్ష పూర్తి చేసిన వైద్యులు.. ఆమె భౌతికఖాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మరికాసేపట్లో కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత పార్థివదేహాన్ని తరలించనున్నారు. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఠా గోపాల్, కార్పొరేటర్ విజయా రెడ్డి ప్రస్తుతం గాంధీ దవాఖాన వద్ద ఉన్నారు. అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు తగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







