ఫిబ్రవరి 26 నుండి వెబ్ సమ్మిట్ ఖతార్
- February 24, 2024
దోహా: మిడిల్ ఈస్ట్లో మొట్టమొదటిసారిగా వెబ్ సమ్మిట్ ఖతార్ ప్రారంభ ఎడిషన్ జరుగనుంది. ఇది ఫిబ్రవరి 26 నుండి 29వరకు దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు వెబ్ సమ్మిట్ ఖతార్ 2024 ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, షేక్ జాసిమ్ బిన్ మన్సూర్ బిన్ జబోర్ అల్ థానీ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ఇ షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ.. ఖతార్ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థపై మాట్లాడతారని ఆయన చెప్పారు. ఎమ్మీ-విజేత హాస్యనటుడు ట్రెవర్ నోహ్, WPP CEO మార్క్ రీడ్, హూప్ CEO విల్ అహ్మద్, వ్యోమగామి మరియు డీప్ స్పేస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు సారా సబ్రీ, రిప్లిట్ సహ వ్యవస్థాపకుడు మరియు CEO అమ్జద్ మసాద్తో సహా పలువురు ప్రముఖ వక్తలు, ఇండస్ట్రీ లీడర్స్ ఇందులో పాల్గొంటాని తెలిపారు. 80 దేశాల నుండి 1,000 కంటే ఎక్కువ స్టార్టప్లతో.. ఖతార్, యుఎస్, ఈజిప్ట్, బ్రెజిల్, ఇటలీ, నైజీరియా, యూకే, భారతదేశం వంటి దేశాల నుండి వచ్చిన 00 మందికి పైగా పెట్టుబడిదారులు, భాగస్వాములతో కనెక్ట్ అయ్యే ఈ ఈవెంట్ ఈ ప్రాంతంలో ఇప్పటివరకు నిర్వహించిన అతిపెద్ద మరియు విభిన్నమైన ఈవెంట్ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







