తెలుగు సినీ రచయిత సిరాశ్రీకి గౌరవ డాక్టరేట్
- February 26, 2024
దుబాయ్: అమెరికాలోని వయోమింగ్ కేంద్రంగా గల గ్లోరీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ 2024 కి గాను దుబాయ్ లో గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను, సేవాతత్పరులను గుర్తించి డాక్టరేట్లను ఇవ్వడం జరిగింది.
భారత్, పాకిస్తాన్, యూ,ఎ.ఈ, నేపాల్, కెనెడా, ఈజిప్ట్, ఐవొరీ కోస్ట్ దేశాలకు చెందిన 23 మందికి ఈ గౌరవ డాక్టరేట్లను స్నాతకోత్సవంలో ప్రదానం చేయడం జరిగింది.
దుబాయ్ లో జరిగిన ఈ వేదుకలో గౌరవ డాక్టరేట్ ను అందుకున్న ఏకైక తెలుగు ప్రముఖుడు సినీగీత రచయిత సిరాశ్రీ. వృత్తిపరంగానే కాకుండా సమాజహితం కోరి ఆయన చేసిన పలు రచనలను గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్ తో సత్కరించడం జరిగింది.
ఐవొరీ కోస్ట్ దేశ రాయబారి వకాబే డయాబి, యూ.ఎ.ఈ నేషనల్ డైరెక్టర్ డా.నాసెర్ సులేమాన్, యూనివెర్సిటీ ఆఫ్రికా డైరెక్టర్ సాంసన్ హెర్మన్, డి.ఎస్.టీ టీవీ-సినిమా మేనేజింగ్ డైరెక్టర్ డా అన్వర్ అలి తదితరులు దుసిట్ థాని హోటల్లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని గౌరవడాక్టరేట్లను అందజేసారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







