‘హరి హర వీరమల్లు’ న్యూ అప్డేట్.!
- February 28, 2024
పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలన్న కోరిక చాలా మంది నిర్మాతల్లో బలంగా వుంటుంది. అలాంటి ఓ బలమైన నిర్మాతే ఎ.ఎమ్ రత్నం.
‘హరి హరవీరమల్లు’ సినిమాతో ఆయనకు ఆ అవకాశం రానే వచ్చింది. అయితే, ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా కాలమే అయినప్పటికీ, ఇంతవరకూ పూర్తి కాలేదు.
సరికదా.. మొత్తానికి ప్రాజెక్ట్ అటకెక్కేసిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయ్. లేటెస్ట్గా ఈ సినిమా నిర్మాత ఎ.ఎమ్.రత్నం ఇదే విషయమై స్పందించారు. ఈ సినిమా ఆగిపోలేదనీ.. అలా అని పూర్తి కావడం కూడా అంత వీజీ కాదని చెప్పేశారు.
పవన్ కళ్యాణ్తో ఏదో ఒక సినిమా చేసేయాలన్నది తన లక్ష్యం కాదనీ, ఇండియా గర్వపడే ఓ అద్భుతమైన సినిమాని పవన్ కళ్యాణ్తో తెరకెక్కించాలన్నదే తన వుద్దేశ్యమనీ.. అలాంటి సినిమానే ‘హరి హరవీరమల్లు’.. సో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని ఆయనతో అలాగే రూపొందిస్తాననీ ఆయన చెప్పారు.
కేవలం 20 రోజులు డేట్స్ తీసుకుని కూడా పవన్ కళ్యాణ్తో సినిమా తెరకెక్కించేయొచ్చు. కానీ, ఆయన స్థాయికి తగ్గ సినిమానే ఆయనతో రూపొందించాలన్న తన తపనను ‘హరి హర వీరమల్లు’తో నెరవేర్చుకుంటానని ఆయన కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. లేట్ అయినా, లేటెస్ట్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఎ.ఎమ్ రత్నం చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీగా ‘హరి హరవీరమల్లు’ను అభివర్ణించారాయన. సో, ఆ రేంజ్కి తగ్గట్లుగానే వుంటుందని చెప్పడంతో.. ఈ సినిమా అయితే ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది.
తాజా వార్తలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!









