తెలంగాణ: రానున్న 5 రోజులు జాగ్రత్త..
- March 03, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారం నుండే ఎండలు విపరీతమైన సంగతి తెలిసిందే. ఇక మార్చి నెల మొదలు కావడం తో రాష్ట్ర వ్యాప్తంగా 38 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటె రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటాయో అని ప్రజలు భయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి.
అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా రికార్డ్ అవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదని , ఏమైనా పనులు ఉంటె ఉదయం , సాయంత్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







