తెలంగాణ: రానున్న 5 రోజులు జాగ్రత్త..
- March 03, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారం నుండే ఎండలు విపరీతమైన సంగతి తెలిసిందే. ఇక మార్చి నెల మొదలు కావడం తో రాష్ట్ర వ్యాప్తంగా 38 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటె రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటాయో అని ప్రజలు భయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి.
అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా రికార్డ్ అవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదని , ఏమైనా పనులు ఉంటె ఉదయం , సాయంత్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!
- అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో ఫౌంటెన్ తిరిగి ప్రారంభం..!!
- అమెరికా వెళ్లే.. ఖతార్ ఫుట్బాల్ అభిమానుల కోసం గైడ్ లైన్స్ జారీ..!!
- వాట్సాప్ ఫేక్ కాల్స్కు ఇక ఫుల్ స్టాప్!
- తెలంగాణ ప్రజలకు బిగ్అలర్ట్..
- ఏపీలో కొత్తగా 1,050 ఎలక్ట్రిక్ బస్సులు









