రమదాన్ 2024: ప్రభుత్వ రంగ ఉద్యోగులకు తగ్గిన పని గంటలు
- March 04, 2024
యూఏఈ: రమదాన్ సందర్భంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులకు అధికారిక పని వేళలను యూఏఈ ప్రకటించింది. ఫెడరల్ ఉద్యోగులు సోమవారం నుండి గురువారం వరకు 3.5 గంటలు మరియు శుక్రవారం 1.5 గంటలు తక్కువ పని చేస్తారని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (FAHR) ప్రకటించింది. ఇస్లామిక్ పవిత్ర మాసంలో సోమవారం నుండి గురువారం వరకు అన్ని మంత్రిత్వ శాఖలు మరియు ఫెడరల్ ఏజెన్సీలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు పనిచేస్తాయి. శుక్రవారాల్లో మాత్రం పని యొక్క స్వభావాన్ని బట్టి అవసరమైతే తప్ప, పని గంటలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. ఇక మంత్రిత్వ శాఖలు మరియు ఫెడరల్ ఏజెన్సీలు పవిత్ర మాసంలో పని దినాలలో ఆమోదించే సౌకర్యవంతమైన లేదా రిమోట్ వర్క్ షెడ్యూల్లను అమలు చేయడం కొనసాగించవచ్చని తెలిపింది. దీంతోపాటు ఉద్యోగులు రమదాన్ సందర్భంగా శుక్రవారం రిమోట్గా పని చేసే సౌలభ్యాన్ని మంజూరు చేయవచ్చు. అయితే, ఆమోదించబడిన మార్గదర్శకాల ప్రకారం మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 70 శాతానికి మించకుండా ఈ సౌలభ్యాన్ని పరిమితం చేయాలి. దుబాయ్ ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ (IACAD) ప్రచురించిన హిజ్రీ క్యాలెండర్ ప్రకారం.. రమదాన్ మార్చి 12( మంగళవారం) నుండి ప్రారంభమవుతుంది. యూఏఈ ఫెడరల్ ప్రభుత్వం వారానికి నాలుగైదు రోజుల పనిని అమలు చేసింది. రమదాన్ కాకుండా ఇతర నెలల్లో ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తారు. ప్రత్యేకంగా వారు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు మరియు శుక్రవారం ఉదయం 7:30 నుండి 12:00 వరకు పని చేస్తారు. శని మరియు ఆదివారాలు ఫెడరల్ ప్రభుత్వ రంగానికి అధికారిక సెలవులు. అబుదాబి, దుబాయ్, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, రస్ అల్ ఖైమా మరియు ఫుజైరాలోని స్థానిక ప్రభుత్వ సంస్థలు ఇదే విధమైన పని వారం విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే, షార్జాలోని ఫెడరల్ ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పని చేస్తారు. సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 3.30 వరకు..షార్జాలో అధికారిక వారాంతం మూడు రోజులు..శుక్రవారం, శనివారం మరియు ఆదివారం ఉంటుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







