కొన్ని కుటుంబాల లబ్ధి కోసమే జమ్మూకశ్మీర్ను సంకెళ్లలో వేశారు: ప్రధాని మోడీ
- March 07, 2024
శ్రీనగర్: రోజు శ్రీనగర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఆంక్షల నుంచి స్వేచ్ఛ దొరికిందన్నారు. ఎన్నో దశాబ్ధాలుగా రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్తో పాటు మిత్రపక్ష పార్టీలు 370 ఆర్టికల్ పేరుతో జమ్మూకశ్మీర్ ప్రజల్ని, దేశాన్ని తప్పుదోవ పట్టించాయని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 370 నుంచి జమ్మూకశ్మీర్ లబ్ధి పొందిందా, లేదా కొన్ని రాజకీయ కుటుంబాలు మాత్రమే లాభపడ్డాయా అని ఆయన ప్రశ్నించారు. తమను తప్పుదోవ పట్టించారన్న విషయాన్ని జమ్మూకశ్మీర్ ప్రజలు ఆలస్యంగా గ్రహించారని మోడీ పేర్కొన్నారు. కొన్ని కుటుంబాల లబ్ధి కోసమే జమ్మూకశ్మీర్ను సంకెళ్లలో వేసేశారన్నారు. ఇవాళ జమ్మూకశ్మీర్లో 370 లేదు అని, దీని వల్ల ఆ రాష్ట్ర యువత ప్రతిభకు గౌరవం దక్కుతోందని, ఫలితంగా కొత్త అవకాశాలు వస్తున్నట్లు మోడీ చెప్పారు. సమాన హక్కులు, సమాన అవకాశాలు లభిస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్లో స్వీట్న్డ్ డ్రింక్స్కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







