స్కామ్ అలెర్ట్: 'వేగవంతమైన స్కెంజెన్ వీసా' పేరుతో అదనపు వసూళ్లు
- March 08, 2024
యూఏఈ: స్కెంజెన్ వీసాను త్వరగా ఇప్పిస్తానని కొందరు ట్రావెల్ ఏజెంట్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. Dh500 చెల్లిస్తే చెల్లిస్తే తనకు పోర్చుగల్ వెళ్లేందుకు అవసరమైన వీసా ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తామని ఓ ట్రావెల్ ఏజెంట్ తనను సంప్రదించినట్లు యూఏఈ నివాసి ఒకరు తెలిపారు. కానీ అదృష్టవశాత్తూ అది ఒక స్కామ్ అని తన స్నేహితులు చెప్పడంతో పెద్ద మోసం నుండి బయటపడినట్లు పేర్కొన్నాడు. మరోవైపు పాస్పోర్ట్ మరియు వీసా అవుట్సోర్స్ కంపెనీ VFS గ్లోబల్.. స్కెంజెన్ అపాయింట్మెంట్ స్లాట్ల పేరిట ప్రయాణికులను వారి డబ్బును మోసగిస్తున్న ఏజెంట్లు చాలా మంది ఉన్నారని హెచ్చరించింది. "అపాయింట్మెంట్ స్లాట్లను పొందేందుకు ఛార్జీలు వసూలు చేసే ఎవరైనా మోసపూరితమైనవారని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము" అని VFS గ్లోబల్ UAE రీజినల్ హెడ్ మోనాజ్ బిల్లిమోరియా అన్నారు. ఇటువంటి స్కామ్లకు గురికాకుండా ప్రజలకు మేము సలహా ఇవ్వాలనుకుంటున్నామని తెలిపారు.
వీసా దరఖాస్తులను అందించే తన అధికారిక వెబ్సైట్లో అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవడానికి VFS గ్లోబల్ ఎటువంటి రుసుమును వసూలు చేయదని వారు స్పష్టం చేశారు. “కొన్ని ప్రభుత్వాలు అపాయింట్మెంట్ బుక్ చేసుకునే సమయంలో సేవా రుసుమును ముందుగా చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సమయంలో ఈ చెల్లింపు తిరిగి చెల్లించబడుతుంది లేదా తీసివేయబడుతుంది. నిజమైన ప్రయాణికులు అపాయింట్మెంట్ బుకింగ్ను ఉపయోగిస్తున్నారని మరియు మోసపూరిత సంస్థల దుర్వినియోగం నుండి సిస్టమ్ సురక్షితంగా ఉంచబడుతుందని నిర్ధారించడానికి మాత్రమే ఈ ప్రక్రియ.” అని వెల్లడించారు.
ఇదిలా ఉండగా UK వీసాల డిమాండ్కు అనుగుణంగా..VFS గ్లోబల్ యూఏఈ లోని నాలుగు ఎమిరేట్స్లో ప్రత్యేక ప్రీమియం కేంద్రాలను ప్రారంభించింది. ప్రజలు తమ సెలవులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఏజెన్సీ సూచించింది. గత సంవత్సరం జూన్లో ప్రయాణికులు స్కెంజెన్ వీసా అపాయింట్మెంట్ పొందడానికి మూడు నెలల వరకు వేచి ఉండాల్సి వచ్చిందన్నారు. ఈ పరిస్థితుల కారణంగా చాలా మంది వ్యక్తులు తమ వీసా రుసుముతో ప్రాసెస్ చేయించుకోవచ్చని ముందుకు వచ్చి ఏజెంట్ల ద్వారా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. చాలా మంది నివాసితులు ఇటువంటి మోసాల బారిన పడతారని వెల్లడించారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









