తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు..విజేత తెలుగు వారియర్స్
- March 11, 2024
ఖతార్: ఖతార్ లో నివసిస్తున్న తెలుగు కార్మికులకు క్రీడా స్ఫూర్తి నింపేందుకు ప్రతియేటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత 3 వారాలుగా జరుగుతున్న క్రికెట్ పోటీలు మార్చ్ 8న ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో భగత్ సింగ్ జట్టును తెలుగు వారియర్స్ ఓడించి TGS TPl 9 ట్రోఫీని అందుకుంది. ముగింపు కార్యక్రమంలో భారత రాయబారి కార్యాలయంలో హెడ్ ఆఫ్ లెబర్ వెల్ఫేయిర్ ఇంచార్జ్ జయ గణేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.గెస్ట్ ఆఫ్ హానర్ ICBF అధ్యక్షుడు శనవాస్ బావ మాట్లాడుతూ.. TGS కార్మికుల కోసం నిరంతరం పని చేస్తున్నదని అభినందిచారు. తెలుగు సంఘాల బిష్మ పితా కోడూరి శివప్రసాదరావు మాట్లాడుతూ.. గల్ఫ్ సమితి అన్ని కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొనడం సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ICBF ఉపాధ్యక్షుడు దీపక్ షెట్టి ,ICBF సెక్రెటరీ మహమ్మద్ కుని,ICBF తెలుగు రెపర్సెంటివ్ శంకర్ గౌడ్, Qpl ఫౌండేర్స్ సిరాజ్అన్సారీ, హంజత్, గులరాజ్,అన్వేర్ లు విజేతలకి బహుమతులు అందజేశారు. తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధు, ఉపాధ్యక్షుడు గడ్డి రాజు,వంశీ,గోలి,సాగర్,ఎల్లన్న,ఎల్లన్న, శ్రీధర్,రాజేష్ పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









