రేపటి నుంచి భారత్ లో రంజాన్ దీక్షలు ప్రారంభం
- March 11, 2024
న్యూ ఢిల్లీ: రేపటి నుండి భారత్ లో రంజాన్ దీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. సౌదీ అరేబియాలో ఈరోజు (మార్చి 11 ) రంజాన్ చంద్రుడు కనిపించాడు. కనుక ఇక్కడ మొదటి రోజాను మార్చి 11న ఆచరిస్తారు. భారతదేశం, పాకిస్తాన్లలో, సౌదీ అరేబియా చంద్రుని తర్వాత ఒక రోజు రంజాన్ చంద్రుడు కనిపిస్తాడు.. అందుకే ఈ దేశాలలో సౌదీ అరేబియా తర్వాత ఒక రోజు రంజాన్ ఉపవాసం ప్రారంభమవుతుంది. అంటే భారతదేశంలో రేపటి నుండి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఈ నెలలో, ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. రంజాన్ సమయంలో ఉపవాసం ఉండటం ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముస్లింలు 29 లేదా 30 ఉపవాసాలు పాటిస్తారా అనేది తిరిగి చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. ఇది నెల ప్రారంభం, ముగింపును నిర్ణయించడంలో కీలకమైనది. రంజాన్ మాసం ముగిసిన తరువాత ముస్లింలు ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు.
తాజా వార్తలు
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు







