సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు
- March 11, 2024
తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టబోతోంది. సికింద్రాబాద్- విశాఖ మధ్య రెండో వందేభారత్ రైలు రేపు ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. గురువారం మినహా ఇతర రోజుల్లో వందేభారత్ రైలు సర్వీసులు అందించనున్నది.
విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు కొత్త వందే భారత్ ట్రైన్ మార్చి 13 నుండి ప్రారంభం కానుండగా.. తిరుగు ప్రయాణంలోనూ సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వరకు 15 వ తేదీ శుక్రవారం నుండి ప్రారంభమవుతాయి. వీటికి టిక్కెట్ల బుకింగ్స్ మార్చి 12 నుండి అందుబాటులోఉంటాయి. రైలు నంబర్ 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్ నుండి ఉదయం 05.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అటువైపు నుంచి రైలు నంబర్ 20708 విశాఖ నుంచి వందేభారత్ రైలు 14.35 గంటలకు బయలుదేరి రాత్రి 11.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్లో స్వీట్న్డ్ డ్రింక్స్కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







