OMR30 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిన రవాణా మంత్రిత్వ శాఖ
- March 14, 2024
మస్కట్: రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2023 చివరి నాటికి సుమారు OMR30 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2022 గణాంకాలతో పోలిస్తే 66 శాతం పెరిగింది. 2023లో మంత్రిత్వ శాఖ తన పర్యవేక్షణలో ఇప్పటికే ఉన్న అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రైవేట్ రంగ బకాయిల నుండి OMR216 మిలియన్లకు పైగా చెల్లించినట్టు రవాణా, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ ఫహద్ సలీం అల్ హినై తెలిపారు. ఇటీవలి వాతావరణ పరిస్థితులలో రోడ్ నెట్వర్క్కు జరిగిన నష్టాలను రోడ్డు నిర్మాణం, నిర్వహణ మరియు మరమ్మత్తులను కవర్ చేయడానికి చెల్లింపులు జరిగాయని అల్ హినై వెల్లడించారు. అదే విధంగా కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో డిజిటల్ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్లకు సంబంధించిన బకాయిలను కూడా మంత్రిత్వ శాఖ పరిష్కరించిందని ఆయన వివరించారు. 2023లో మంత్రిత్వ శాఖ 230 ప్రోగ్రామ్లు మరియు శిక్షణా వర్క్షాప్లను అమలు చేసిందన్నారు. అలాగే స్థానికంగా మరియు విదేశాలలో నిర్వహించిన ప్రత్యేక వర్క్షాప్ల నుండి మంత్రిత్వ శాఖలోని 1,916 మందికి పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందారని తెలిపారు.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







