ఒమన్ జాతీయుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన భారతీయుడు

- March 16, 2024 , by Maagulf
ఒమన్ జాతీయుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన భారతీయుడు

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని శివపురిలో మరణించిన వ్యక్తి అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు తీసుకున్న గొప్ప నిర్ణయం.. ఒమన్‌కు చెందిన రోగికి కొత్త జీవితం లభించింది. 48 సంవత్సరాల వయస్సు గల రాజేష్ (పేరు మార్చబడింది), మార్చి 14న బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. రాజేష్ భార్య నళిని అతని అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకుంది. సర్ గంగారామ్ హాస్పిటల్ నుండి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసింది. ఎయిర్‌పోర్ట్ టార్మాక్ వద్ద వేచి ఉన్న ఒక చార్టర్డ్ విమానం రాజేష్ గుండెను చెన్నైలోని MGM ఆసుపత్రికి తరలించింది. అక్కడ ఒమన్‌కు చెందిన ఒక రోగికి దానిని విజయవంతంగా అమర్చారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com