అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య
- March 16, 2024
అమెరికా: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా తెనాలి మం. బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్ బోస్టన్ వర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మార్చి 11న ఆ క్యాంపస్లోనే అభిజిత్ను హత్య చేసి, మృతదేహాన్ని కారులో ఉంచి అడవిలో వదిలేశారు. స్నేహితుల ఫిర్యాదుతో అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. .
నిన్న రాత్రి అభిజిత్ డెడ్ బాడీ స్వగ్రామానికి తీసుకొచ్చారు. అభిజిత్ వయస్సు 20 ఏళ్లు.. ఈ నెల 11వ తేదీన యూనివర్సిటీ క్యాంపస్లో గుర్తుతెలియని వ్యక్తులు అభిజిత్ను హత్యచేసినట్టుగా తెలుస్తోంది.. అభిజిత్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రుల పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మి బోరున విలపిస్తున్నారు. చదువకోడానికి వెళ్లిన బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు బాధ వర్ణణాతీతం. అభిజిత్ మృతదేహానికి ఈరోజు అంత్యక్రియలు జరుగనున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!
- పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!









