హైదరాబాద్ మెట్రోలో రజనీకాంత్.. చరిత్రాత్మకమన్న ఎల్ అండ్ టీ
- March 16, 2024
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు డిపోకు అరుదైన అతిథి విచ్చేశారు. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా సందర్శించే నాగోల్లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ని సూపర్ స్టార్ రజనీకాంత్ సందర్శించారు.దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ఎల్అండ్టీ మెట్రో రైలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. మెట్రోరైలు ఆపరేషన్స్కు నాగోల్లోని ఓసీసీ గురించి రజనీకాంత్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఆయన మెట్రో రైలు ఓసీసీని సందర్శించారు. నాగోల్కు వచ్చి అక్కడి మెట్రో సిబ్బందితో మాట్లాడారు. మెట్రోలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించిన పరిస్థితులను చూశారు. మెట్రో రైలు అధికారులను సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మెట్రో రైలు ఓసీసీని సందర్శించడంపై ఎల్అండ్టీ మెట్రో రైలు యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. తమకు నిజంగా చారిత్రాత్మక సందర్భం అని తెలిపింది. ఈ క్షణం L&TMRHLకి అత్యంత కీలకమని తెలిపింది.
తాజా వార్తలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- హైదరాబాద్లో ఆపిల్ రిటైల్ స్టోర్..
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!







