హైదరాబాద్ మెట్రోలో రజనీకాంత్.. చరిత్రాత్మకమన్న ఎల్ అండ్ టీ
- March 16, 2024
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు డిపోకు అరుదైన అతిథి విచ్చేశారు. విద్యార్థులు, సాంకేతిక నిపుణులు ఎక్కువగా సందర్శించే నాగోల్లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ని సూపర్ స్టార్ రజనీకాంత్ సందర్శించారు.దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ఎల్అండ్టీ మెట్రో రైలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. మెట్రోరైలు ఆపరేషన్స్కు నాగోల్లోని ఓసీసీ గురించి రజనీకాంత్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ఆయన మెట్రో రైలు ఓసీసీని సందర్శించారు. నాగోల్కు వచ్చి అక్కడి మెట్రో సిబ్బందితో మాట్లాడారు. మెట్రోలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించిన పరిస్థితులను చూశారు. మెట్రో రైలు అధికారులను సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మెట్రో రైలు ఓసీసీని సందర్శించడంపై ఎల్అండ్టీ మెట్రో రైలు యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. తమకు నిజంగా చారిత్రాత్మక సందర్భం అని తెలిపింది. ఈ క్షణం L&TMRHLకి అత్యంత కీలకమని తెలిపింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు