లోక్సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- March 16, 2024
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం (EC) శనివారం విడుదల చేసింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కూడా విడుదల చేయనున్నట్లు ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి వుందని అన్నారు. దేశవ్యాప్తంగా నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ప్రస్తుత 17వ లోక్సభ గడువు జూన్ 16తో ముగియనున్న సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఇసి తెలిపారు. వారిలో 49.7 కోట్ల మంది పురుష ఓటర్లు, 47.1 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కోటి 80 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. వందేళ్లు దాటిన వారు 2 లక్షల 18 వేల మంది ఉన్నారు. 85 ఏళ్లు నిండిన వారు 82 లక్షల మంది. 85 ఏళ్లు దాటిన వారికి, విభిన్న ప్రతిభావంతులకు ఓట్ ఫర్ హోం పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. 48వేల ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు. 18-19 వయస్సు మధ్య ఉన్న ఓటర్లు 21 లక్షల మంది. 12 రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 1.5 కోట్ల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గననున్నారు. దేశవ్యాప్తంగా 55 లక్షల ఇవిఎంలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. మొదటి సారిగా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్స్ వినియోగించనున్నట్లు ప్రకటించారు.

తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









