ప్రశ్నా పత్రాల లీక్ కేసు.. ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించిన అప్పీల్ కోర్టు
- March 17, 2024
కువైట్ సిటీ: ప్రశ్నా పత్రాల లీక్ కేసులో ఒక కువైట్ వ్యక్తికి, కువైట్ మహిళకు రెండేళ్ళ జైలుశిక్ష.. ప్రవాస వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు వెలువరించిన తీర్పును న్యాయమూర్తి అబ్దుల్ రెహ్మాన్ అల్ దర్మీ అధ్యక్షతన అప్పీల్ కోర్టు కొట్టివేసింది. హైస్కూల్ పరీక్షల ప్రశ్న పత్రాలను లీక్ చేసినందుకు.. KD 308,000 లాండరింగ్ చేసినందుకు ప్రవాస మహిళకు, వ్యక్తికి ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష ప్రకటించగా.. తాజాగా కోర్టు వారిపై ఉన్న అభియోగాలను కొట్టివేసి నిర్దోషులుగా ప్రకటించింది. మరో కేసులో ప్రశ్న పత్రాలను లీక్ చేసినందుకు కువైట్ పౌరుడిని నిర్దోషిగా ప్రకటించడాన్ని సమర్థించింది. పోలీసుల దర్యాప్తులో హైస్కూల్ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేయడంలో ఇతరుల ప్రమేయం, నిందితుల పాత్ర, అలాగే నేరాల ఫలితంగా వారి బ్యాంక్ ఖాతాలలోకి అక్రమంగా డబ్బు జమ అయినట్లు విచారణలో వెల్లడి కావడంతో దిగువ కోర్టు దోషులగా నిర్ధారించి శిక్షలు విధించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష