నఖీల్, మైదాన్ విలీనం..షేక్ మొహమ్మద్

- March 17, 2024 , by Maagulf
నఖీల్, మైదాన్ విలీనం..షేక్ మొహమ్మద్

దుబాయ్: అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ డెవలపర్లు నఖీల్, మైదాన్ దుబాయ్ హోల్డింగ్ గొడుగు కింద చేరబోతున్నాయని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శనివారం ప్రకటించారు."దుబాయ్ యొక్క ఆర్థిక వృద్ధిని ఏకీకృతం చేయడానికి మరింత ఆర్థికంగా సమర్థవంతమైన సంస్థను సృష్టించడం ద్వారా  ప్రపంచవ్యాప్తంగా పోటీపడవచ్చు. మా జాతీయ లక్ష్యాలను సాధించడం..  దుబాయ్ ఆర్థిక ఎజెండా D33ని సాధించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం." అని దుబాయ్ పాలకుడు, యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి X లో చేసిన ఒక పోస్ట్‌లో తెలిపారు. ఈ ప్రపంచ ఆర్థిక సంస్థ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలో నడుస్తుందని ఆయన తెలిపారు. నఖీల్ మరియు మైదాన్ రియల్ ఎస్టేట్, రిటైల్, హాస్పిటాలిటీ, ఫుడ్ అండ్ బెవరేజ్, లీజర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు హెల్త్‌కేర్‌తో సహా పలు రంగాలలో అనేక ప్రాజెక్ట్‌లను ప్రారంభించాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com