సౌక్ వాకీఫ్ పని వేళల్లో మార్పులు
- March 17, 2024
దోహా: రమదాన్ సందర్భంగా పలు వేలంపాటల షెడ్యూల్ను సౌక్ వాకీఫ్ ప్రకటించారు. ప్రతి శుక్రవారం తరావిహ్ ప్రార్థన తర్వాత పక్షులు, పురాతన వస్తువుల వేలం జరుగుతుందని సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్లో సౌక్ వాకిఫ్ పేర్కొన్నది. పక్షుల వేలం పక్షి మార్కెట్లో జరుగుతుండగా, పురాతన వస్తువుల వేలం ఆరుమైలా హోటల్ ఎదురుగా జరుగుతుంది. సౌక్ వాకిఫ్లో ట్రఫుల్ వేలం కూడా ఈస్టర్న్ స్క్వేర్లో ప్రతి శుక్రవారం రాత్రి 8:30కి మార్పు చేశారు. పవిత్ర రమదాన్ మాసంలో సౌక్ వాకిఫ్లోని దుకాణాలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు ఇఫ్తార్ సమయం నుండి తెల్లవారు జామున 1 గంటల వరకు తెరిచి ఉంటాయి. సుహూర్ సమయం వరకు ఈ ప్రాంతంలోని రెస్టారెంట్లు తెరిచి ఉంటాయి. పవిత్ర మాసంలో ఈ ప్రాంతంలో అనేక కార్యకలాపాలు ప్రారంభించబడినందున సౌక్ వాకిఫ్ నివాసితులు మరియు పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని కొత్త సమయాలను ప్రకటించినట్లు సౌక్ వాకిఫ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







