సౌక్ వాకీఫ్ పని వేళల్లో మార్పులు
- March 17, 2024
దోహా: రమదాన్ సందర్భంగా పలు వేలంపాటల షెడ్యూల్ను సౌక్ వాకీఫ్ ప్రకటించారు. ప్రతి శుక్రవారం తరావిహ్ ప్రార్థన తర్వాత పక్షులు, పురాతన వస్తువుల వేలం జరుగుతుందని సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్లో సౌక్ వాకిఫ్ పేర్కొన్నది. పక్షుల వేలం పక్షి మార్కెట్లో జరుగుతుండగా, పురాతన వస్తువుల వేలం ఆరుమైలా హోటల్ ఎదురుగా జరుగుతుంది. సౌక్ వాకిఫ్లో ట్రఫుల్ వేలం కూడా ఈస్టర్న్ స్క్వేర్లో ప్రతి శుక్రవారం రాత్రి 8:30కి మార్పు చేశారు. పవిత్ర రమదాన్ మాసంలో సౌక్ వాకిఫ్లోని దుకాణాలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు ఇఫ్తార్ సమయం నుండి తెల్లవారు జామున 1 గంటల వరకు తెరిచి ఉంటాయి. సుహూర్ సమయం వరకు ఈ ప్రాంతంలోని రెస్టారెంట్లు తెరిచి ఉంటాయి. పవిత్ర మాసంలో ఈ ప్రాంతంలో అనేక కార్యకలాపాలు ప్రారంభించబడినందున సౌక్ వాకిఫ్ నివాసితులు మరియు పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని కొత్త సమయాలను ప్రకటించినట్లు సౌక్ వాకిఫ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









