సౌక్ వాకీఫ్ పని వేళల్లో మార్పులు
- March 17, 2024
దోహా: రమదాన్ సందర్భంగా పలు వేలంపాటల షెడ్యూల్ను సౌక్ వాకీఫ్ ప్రకటించారు. ప్రతి శుక్రవారం తరావిహ్ ప్రార్థన తర్వాత పక్షులు, పురాతన వస్తువుల వేలం జరుగుతుందని సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్లో సౌక్ వాకిఫ్ పేర్కొన్నది. పక్షుల వేలం పక్షి మార్కెట్లో జరుగుతుండగా, పురాతన వస్తువుల వేలం ఆరుమైలా హోటల్ ఎదురుగా జరుగుతుంది. సౌక్ వాకిఫ్లో ట్రఫుల్ వేలం కూడా ఈస్టర్న్ స్క్వేర్లో ప్రతి శుక్రవారం రాత్రి 8:30కి మార్పు చేశారు. పవిత్ర రమదాన్ మాసంలో సౌక్ వాకిఫ్లోని దుకాణాలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు ఇఫ్తార్ సమయం నుండి తెల్లవారు జామున 1 గంటల వరకు తెరిచి ఉంటాయి. సుహూర్ సమయం వరకు ఈ ప్రాంతంలోని రెస్టారెంట్లు తెరిచి ఉంటాయి. పవిత్ర మాసంలో ఈ ప్రాంతంలో అనేక కార్యకలాపాలు ప్రారంభించబడినందున సౌక్ వాకిఫ్ నివాసితులు మరియు పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని కొత్త సమయాలను ప్రకటించినట్లు సౌక్ వాకిఫ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు