సౌక్ వాకీఫ్ పని వేళల్లో మార్పులు
- March 17, 2024
దోహా: రమదాన్ సందర్భంగా పలు వేలంపాటల షెడ్యూల్ను సౌక్ వాకీఫ్ ప్రకటించారు. ప్రతి శుక్రవారం తరావిహ్ ప్రార్థన తర్వాత పక్షులు, పురాతన వస్తువుల వేలం జరుగుతుందని సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్లో సౌక్ వాకిఫ్ పేర్కొన్నది. పక్షుల వేలం పక్షి మార్కెట్లో జరుగుతుండగా, పురాతన వస్తువుల వేలం ఆరుమైలా హోటల్ ఎదురుగా జరుగుతుంది. సౌక్ వాకిఫ్లో ట్రఫుల్ వేలం కూడా ఈస్టర్న్ స్క్వేర్లో ప్రతి శుక్రవారం రాత్రి 8:30కి మార్పు చేశారు. పవిత్ర రమదాన్ మాసంలో సౌక్ వాకిఫ్లోని దుకాణాలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు ఇఫ్తార్ సమయం నుండి తెల్లవారు జామున 1 గంటల వరకు తెరిచి ఉంటాయి. సుహూర్ సమయం వరకు ఈ ప్రాంతంలోని రెస్టారెంట్లు తెరిచి ఉంటాయి. పవిత్ర మాసంలో ఈ ప్రాంతంలో అనేక కార్యకలాపాలు ప్రారంభించబడినందున సౌక్ వాకిఫ్ నివాసితులు మరియు పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని కొత్త సమయాలను ప్రకటించినట్లు సౌక్ వాకిఫ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
- బ్యాంకుల్లో బయోమెట్రిక్ వేరిఫికేషన్..వినియోగం పై ఆందోళనలు?
- ఇరాన్ కు వ్యతిరేకంగా..ఐసీఏఓ వద్ద కువైట్ సెకండ్ ప్రొటెస్ట్..!!
- బార్కాలో ఒక వాణిజ్య సంస్థ మూసివేత..!!
- ఫేక్ బహ్రెయిన్ దినార్లు..ఐదేళ్ల జైలుశిక్ష, BD500 ఫైన్..!!
- ఆయిల్ ఔట్ పుల్ ని పెంచనున్న 7 ఒపెక్+ దేశాలు..!!
- ఎయిర్ స్పేస్ క్లోజ్,ఫ్లైట్స్ సస్పెన్షన్..ఖండించిన QCAA..!!
- యూఏఈలో ‘ఎమిరేట్స్ లేబర్ మార్కెట్ అవార్డు’ ప్రకటన..
- ఆగస్టు నుంచి రైల్వే టికెట్ బుకింగ్లో సరికొత్త మార్పు
- తిరుమల శ్రీవాణి టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు..









