ఏప్రిల్ 28న డల్లాస్లో ‘మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక’
- March 19, 2024
డల్లాస్: ప్రతి మనిషికి తన చిన్ననాటి మిత్రులను కలవాలని, వారితో ఆనాటి ముచ్చట్లను పంచుకోవాలని, తమకు చదువులు చెప్పిన గురువులను కలవాలని.. వారికి కృతజ్ఞత తెలుపుకోవాలని ఉంటుంది. సరిగ్గా అలాంటి వారి కోసమే ఇది. బందరులో మీరు ఏ సంవత్సరంలో అయినా చదివినా.. ఏ స్కూల్ అయినా కావచ్చు, ఏ కాలేజ్ అయినా కావచ్చు.. మీరు మీ చిన్ననాటి మిత్రులను కలిసే అపూర్వ అవకాశాన్ని అమెరికాలోని బందరు కమ్యూనిటీ సభ్యులు కల్పిస్తున్నారు. గత 24 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జనవరి 26న హైదరాబాదులో ఘనంగా నిర్వహిస్తున్న మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమం స్ఫూర్తితో అమెరికాలోని డల్లాస్ లోనూ బందరు పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది డల్లాస్ లో స్థిరపడిన బందరు పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ప్రవేశం ఉచితం. వేదిక డల్లాస్ లో ఏర్పాటు చేయనున్నారు.ఏప్రిల్ 28వ తేదీన (ఆదివారం) ఉదయం 9.00 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుంది.మరిన్ని వివరాలకు దొరరాజు (Olive Mithai Shop) ఫోన్ నంబర్ 9000773399, మద్దుల గిరీష్ కుమార్ (9848030305) లను సంప్రదించవచ్చు.ఈ ఫోన్ నెంబర్లకు మెసేజ్ పెడితే బందరు పూర్వ విద్యార్థుల గ్రూప్ లో యాడ్ చేస్తామని నిర్వాహకులు తెలియజేశారు.
--శ్రీకాంత్ చిత్తర్వు (ఎడిటర్-ఇన్-చీఫ్ మాగల్ఫ్ న్యూస్)
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









