ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

- March 19, 2024 , by Maagulf
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి జాతీయ పురస్కారం

విశాఖపట్నం: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆచార్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్-2024 పురస్కారం లభించింది.రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ ఈ పురస్కారాన్ని ఆచార్య లక్ష్మీ ప్రసాద్ కు ప్రకటించగా, మంగళవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో వై.అల్.పి కి అవార్డ్ ను అందచేసి అభినందించారు. ఏయూ ఆచార్యులు సాధించే పురస్కారాల వర్సిటీకి ప్రతిష్టను పెంచుతాయన్నారు. ఈ సందర్భంగా ఆచార్య లక్ష్మీ ప్రసాద్ ను పలువురు విశ్వవిద్యాలయ ఆచార్యులు అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com