ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్
- March 19, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును విచారిస్తోన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నాగ్ పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు.
నాగ్ పాల్ స్థానంలో జడ్జి కావేరి బవేజా నియామకమయ్యారు.దీంతో ఇక నుండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును జడ్జి కావేరి విచారించనున్నారు. నాగ్ పాల్తో పాటు ఢిల్లీ హైకోర్టు జ్యూడిషియల్ సర్వీసెస్లోని మరో 26 మంది జడ్జీలు సైతం ఇవాళ బదిలీ అయ్యారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరపర్చించింది. కవిత రిమాండ్పై వాదనలు విన్న జడ్జి నాగ్ పాల్.. ఆమెను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించారు. కవిత అరెస్ట్ కావడం.. ఆమెను వారంరోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన మూడు రోజుల్లోనే జడ్జి నాగ్ పాల్ బదిలీ కావడం హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక దశలో ఉండగా.. ఇప్పటి వరకు ఈ కేసులో కీలక ఆదేశాలిచ్చిన జడ్జి నాగ్ పాల్ అనూహ్యంగా ట్రాన్స్ఫర్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!







