ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్
- March 19, 2024న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును విచారిస్తోన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి నాగ్ పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు.
నాగ్ పాల్ స్థానంలో జడ్జి కావేరి బవేజా నియామకమయ్యారు.దీంతో ఇక నుండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును జడ్జి కావేరి విచారించనున్నారు. నాగ్ పాల్తో పాటు ఢిల్లీ హైకోర్టు జ్యూడిషియల్ సర్వీసెస్లోని మరో 26 మంది జడ్జీలు సైతం ఇవాళ బదిలీ అయ్యారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరపర్చించింది. కవిత రిమాండ్పై వాదనలు విన్న జడ్జి నాగ్ పాల్.. ఆమెను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించారు. కవిత అరెస్ట్ కావడం.. ఆమెను వారంరోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చిన మూడు రోజుల్లోనే జడ్జి నాగ్ పాల్ బదిలీ కావడం హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక దశలో ఉండగా.. ఇప్పటి వరకు ఈ కేసులో కీలక ఆదేశాలిచ్చిన జడ్జి నాగ్ పాల్ అనూహ్యంగా ట్రాన్స్ఫర్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్