ఈ లక్షణాలుంటే.. మధుమేహం అలర్ట్గా భావించాలి.!
- March 19, 2024
మధుమేహం లేదా డయాబెటిస్ దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి దీని బారిన పడితే ఇక అంతే సంగతి. రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా వుండడం వల్ల మధుమేహం వస్తుంది.
దీని కారణంగా శరీరంలో గుండె, కిడ్నీ, కళ్లు.. ఇలా అనేక అవయవాలు ఎఫెక్ట్ అవుతాయ్. దైనందిన జీవితంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. అందుకే ఈ వ్యాధిని తొలి దశలోనే గుర్తించాలి. గుర్తించాకా అశ్రద్ధ చేయరాదని నిపుణులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స తీసుకుంటే, పూర్తి నివారణ సాధ్యం కాకపోయినా నియంత్రణలో వుంచొచ్చు.
చాలా సహజంగా కనిపించే కొన్ని లక్షణాలు డయాబెటిస్కి కారణం కావచ్చు. డయాబెటిస్ వున్నవారిలో చేతులు, కాళ్లకు ఊరికినే చెమటలు పట్టడం.. తిమ్మిరులు వంటి లక్షణాలు కనిపిస్తాయ్.
అలాగే, కొందరిలో చేతులు, కాళ్లలో వేళ్ల మధ్య చర్మం పొడిబారడం.. దురద వంటి లక్షణాలు కూడా కనిపించొచ్చు.
పాదాలు ఎరుపు రంగులో మారి, నొప్పితో కూడిన వాపులు కనిపించడం కూడా డయాబెటిస్కి కారణం కావచ్చు.
అంతేకాదు, కాళ్లలో పగుళ్లు.. పుండ్లు ఏర్పడడం కూడా డయాబెటిస్కి ప్రాధమిక లక్షణాలుగా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు.
ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే.. తదనుగుణంగా జీవన శైలి.. ఆహార శైలిని మార్చుకోవాలనీ నిపణులు సలహా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







