ఉచిత వైఫై 8 స్టేషన్లలో ...

- June 04, 2016 , by Maagulf
ఉచిత వైఫై 8 స్టేషన్లలో ...

రైల్వే ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించేందుకు త్వరలో ఏడు రైల్వే స్టేషన్లులో వైఫై ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ సెర్చింజెన్‌ గూగుల్‌ సాయంతో అలహాబాద్‌, సెల్దాహ్‌తో పాటు ఏడు స్టేషన్లకు ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం రైల్వేశాఖ పదకొండు ప్రాంతాల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని రైల్వే ప్రయాణికులకు కల్పిస్తోంది. ముంబయి సెంట్రల్‌, భువనేశ్వర్‌, కాచిగూడ, విజయవాడ, రాయ్‌పూర్‌, భోపాల్‌, పట్నా, రాంచీ, విశాఖపట్నం, జయపుర, గువాహటిలో ఈ సదుపాయం ఉంది. .
పూణె, ఎర్నాకులం, లఖ్‌నవూ, ఉజ్జయిని, గోరఖ్‌పూర్‌ స్టేషన్లులో త్వరలోనే ఉచిత వైఫై సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రయాణికులకు, సందర్శకులకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు కల్పించేందుకు గూగుల్‌, రైల్‌టెల్‌, పీఎస్‌యూతో కలిసి రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది నాటికి దాదాపు 100 ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లులో ఉచిత వైఫై సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com