'గిర్గాన్' సందర్భంగా అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు
- March 22, 2024
కువైట్: రమదాన్ ఈవెంట్లలో ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రజల భద్రత యొక్క ప్రాముఖ్యతను అంతర్గత మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నివాస ప్రాంతాలలో ఈవెంట్లను నిర్వహించడం మానుకోవాలని ప్రజలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ సూచించింది. ఈ ప్రాంతాల్లో వాహనాలు, వినోద వాహనాలు, బ్యాండ్లు మరియు ఫుడ్ ట్రక్కులను ఉపయోగించకూడదని సలహా జారీ చేసింది. అలాంటి కార్యకలాపాలు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తాయని, అలాగే పిల్లలకు ప్రమాదాన్ని కలిగిస్తాయని హెచ్చరించింది. పవిత్ర మాసం మధ్యలో “గిర్గాన్” సమీపిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని, మంత్రిత్వ శాఖ వాహన డ్రైవర్లు శ్రద్ధ వహించాలన, రద్దీ ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చింది. ముఖ్యంగా అంతర్గత రోడ్ల పై, మరియు పబ్లిక్ రోడ్లపై జాగ్రత్తగా వాహనాలను డ్రైవ్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







