మాదక ద్రవ్యాల హబ్గా ఎపి రాష్ట్రం-ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల
- March 23, 2024
అమరావతి: ఆంధ్ర రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్గా మార్చేశారని, డ్రగ్స్ రవాణా, వాడకంలో ఎపి నంబర్ 1 అనే ముద్ర వేశారని ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ పై శనివారం ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. ఎపిని ఉడ్తా ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని, దేశంలో ఎక్కడ మాదక ద్రవ్యాలు దొరికినా దాని మూలాలు ఏపిలోనే ఉంటున్నాయని పేర్కొన్నారు. 25వేల కేజీల మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే .. తమ తప్పు లేదంటూ బిజెపి, వైసిపి, టిడిపి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్రాల నిఘా వ్యవస్థల మద్దతు లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరతాయని ఆమె ప్రశ్నించారు. ‘డ్రగ్స్ మాఫియాతో మీకు సంబంధం లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? మీ అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపి సేఫ్ హెవెన్గా మారింది. తెర వెనుక ఎంతటి వాళ్లున్నా నిజాలు నిగ్గు తేల్చాలని సిబిఐని కోరుతున్నా. ఆసియాలోనే అతిపెద్ద డ్రగ్ డీల్గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు