వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- March 27, 2024యూఏఈ: పెద్దలు మరియు పిల్లలు ఇద్దరినీ ప్రభావితం చేసే చికెన్పాక్స్ కేసుల పెరుగుదలను ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున చికెన్పాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈలోని వైద్యులు నివాసితులను కోరుతున్నారు. ఇన్ఫెక్షియస్ వరిసెల్లా-జోస్టర్ వైరస్ వల్ల వచ్చే చికెన్ పాక్స్ జ్వరం, గొంతు నొప్పి మరియు విలక్షణమైన దద్దుర్లు వంటి లక్షణాలతో వ్యక్తమవుతుందని వైద్యులు వివరించారు. తుంబే యూనివర్శిటీ హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఫిజీషియన్ డాక్టర్ ఫియాజ్ అహమ్మద్ మాట్లాడుతూ..వేసవి కాలం సమీపిస్తున్న కొద్దీ, సీజన్తో ముడిపడి ఉన్న వివిధ కారణాల వల్ల చికెన్పాక్స్ కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఎక్కువ సమయం ఆరుబయట లేదా ప్రయాణంలో గడుపుతారని, దీంతో వరిసెల్లా-జోస్టర్ వైరస్ వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాప్తి చెందడానికి మరిన్ని అవకాశాలను ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పార్కులు, కొలనులు మరియు పిల్లల శిబిరాలు వంటి రద్దీగా ఉండే ప్రదేశాలలో పిల్లల ఆడుకునే సమయంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేందే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. వరిసెల్లా-జోస్టర్ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకాక 10-21 రోజులలో దద్దుర్లు కనిపిస్తాయని స్పెషలిస్ట్ ఇంటర్నల్ మెడిసిన్ ప్రైమ్ మెడికల్ సెంటర్ మోటార్ సిటీ బ్రాంచ్ డాక్టర్ పవిత్ర వి.రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!